భారత రాజ్యాంగానికి శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలే కీలకం. వీటిపైనే భారత దేశం నడుస్తోంది. ప్రజాస్వామ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి ఉన్న న్యాయ వ్యవస్థ పునాదిలాంటిది. ప్రజలు శాసన, కార్య నిర్వాహక పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్న సమస్యలను తీర్చగలిగేది న్యాయ వ్యవస్థే.
భారత రాజ్యాంగానికి శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలే కీలకం. వీటిపైనే భారత దేశం నడుస్తోంది. ప్రజాస్వామ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి ఉన్న న్యాయ వ్యవస్థ పునాదిలాంటిది. ప్రజలు శాసన, కార్య నిర్వాహక వ్యవస్థల పరంగా ఎదుర్కొన్న సమస్యలను తీర్చగలిగేది న్యాయ వ్యవస్థ మాత్రమే. దేశంలోని అనేక చట్టాలకు నెలవైన న్యాయ వ్యవస్థలో కీలక పాత్రధారులు న్యాయ మూర్తులు. చట్టాలను అనుసరించి వీరు తీర్పులు ఇస్తుంటారు. అందుకే దేశంలో తప్పు జరిగితే.. తమకు కోర్టులు ద్వారా న్యాయం జరుగుతుందని సామాన్యులు విశ్వసిస్తుంటారు. వ్యక్తిగతపరమైన అభిప్రాయాలతో కాకుండా.. న్యాయ వ్యవస్థలో చేసిన చట్టాల ఆధారంగా మాత్రమే జడ్జిమెంట్లు ఇస్తారు న్యాయమూర్తులు.
న్యాయమూర్తులు చెప్పిందే తుది తీర్పు. ఆత్మవంచన చేసుకుని.. కఠినమైన తీర్పులు ఇవ్వాల్సిన సందర్భాలు కచ్చితంగా ప్రతి న్యాయమూర్తి జీవితంలో ఒక్కటైనా ఉంటుంది. ఒక్కోసారి జడ్జిలు కూడా ఆత్మ విమర్శ చేసుకుంటుంటారు. ఇప్పుడు ఓ జడ్జి సంచలన తీర్పుతో కాకుండా సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. తన ఆత్మగౌరవంతో రాజీపడలేక బహిరంగంగా రాజీనామా ప్రకటించి అందరినీ షాక్కు గురి చేశారు బొంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ డియో. వ్యక్తిగత కారణాల కారణంగా రాజీనామా చేస్తున్నట్లు కోర్టులో ప్రకటించారు. బొంబే హైకోర్టు పరిధిలోని నాగ్ పూర్ బెంచ్కు జడ్జిగా వ్యవహరిస్తున్న ఆయన ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.
కోర్టుకు హాజరైన న్యాయమూర్తి చెప్పిన దాని ప్రకారం.. ‘కోర్టుకు హాజరైన ప్రతి ఒక్కరికీ.. నేను క్షమాపణలు చెబుతున్నా. మీరు బాగుపడాలని (లాయర్లను ఉద్దేశించి) కొన్ని సార్లు కఠినంగా వ్యవహరించాను. మీరు బాగుపడాలనే మిమ్మల్ని కోపడ్డాను. మీరంతా నా కుటుంబం లాంటివారు. అంతేగానీ మరో ఉద్దేశం నాకు లేదు. నేను రాజీనామా చేస్తున్నాను. నా ఆత్మగౌరవానికి కించపరుచుకునే విధంగా నేను పనిచేయలేను. మీరు కష్టపడి పనిచేయండి’అని జడ్జి రోహిత్ డియో అన్నారని లాయర్ ఒకరు తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన జడ్జి రోహిత్.. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేసినట్లు చెప్పారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ముర్ముకు అందించినట్లు తెలిపారు
1963, డిసెంబర్ 5న పుట్టిన రోహిత్ డియో.. లా పూర్తి చేసిన ఆయన.. మహారాష్ట్ర ప్రభుత్వానికి అడ్వకేట్ జనరల్ గా పనిచేశారు. 2017లో జూన్లో బొంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తి నియమితులయ్యారు. 2019 ఏప్రిల్లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2025 డిసెంబర్ 4న పదవీ విరమణ చేయాల్సి ఉండగా శక్రవారం అనూహ్యంగా రాజీనామా చేశారు. అయితే మహారాష్ట్ర పభుత్వం చేసిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా విచారణ చేపట్టి స్టే విధించారు. ఈ తీర్పు ఇచ్చిన కొన్ని రోజుల్లోనే రాజీనామా చేయడం వెనుక అనుమానాలు వస్తున్నాయి.