భారత రాజ్యాంగానికి శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలే కీలకం. వీటిపైనే భారత దేశం నడుస్తోంది. ప్రజాస్వామ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి ఉన్న న్యాయ వ్యవస్థ పునాదిలాంటిది. ప్రజలు శాసన, కార్య నిర్వాహక పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్న సమస్యలను తీర్చగలిగేది న్యాయ వ్యవస్థే.