శంభాజీ భిడే వివాదాలకు కేరాఫ్ గా మారాడు. ఎప్పటికప్పుడూ ఏదో ఒక సంచలన వార్తతో అందరి కోపానికి కారణం అవుతున్నాడు. తాజాగా శంభాజీ భిడే సాయి బాబా మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు.
మహాత్మాగాంధీ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన మనవడు అరుణ్ గాంధీ(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు.
పాఠ్యపుస్తకాల్లో చరిత్రకు సంబంధించిన వ్యక్తులు, ఘటనలకు సంబందించిన పాఠాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా మారిన విద్యా విధానం కారణంగా పాఠ్య ప్రణాళిక విషయంలో మార్పులు చోటు చేసుకున్నాయి. అప్రస్తుతం, అవసరం లేనివని చెబుతూ చరిత్రలో కొన్ని పాఠాలను తొలగిస్తున్నారు. మహాత్మా గాంధీకి సంబంధించిన పాఠ్యాంశాలను పాఠ్యపుస్తకాల నుంచి తొలగించారు.
స్వాతంత్ర ఉద్యమం సమయంలో మహాత్మాగాంధీ అహింసా మార్గంలో బ్రిటీష్ వారిని ముప్పతిప్పలు పెట్టారు. మహాత్మాగాంధీ మహారాష్ట్రలోని మణి భవన్ లోనే ఎక్కువ బసచేసేవారు. స్వాతంత్ర సంగ్రామ సమయంలో తీసుకున్న కీలు నిర్ణయాలు ఇక్కడే నాంధిపడ్డాయని అంటారు.
డబ్బు డబ్బు నువ్వు ఏం చేస్తావు అంటే మనుషుల ఎమోషన్స్ తో ఆడుకుంటాను అని అన్నదట. నిజానికి డబ్బు మాట్లాడటం ఏమిటండి, విచిత్రం కాకపోతే. పాపం దానికేమీ తెలియదు. నోరు లేని మూగ జీవి. కానీ మనిషే మొత్తం తప్పంతా డబ్బుదే అని డబ్బు మీద తోసేస్తాడు. అది సరే గానీ కరెన్సీ నోటు మీద బోసి నవ్వులు నవ్వుతూ గాంధీ తాత బొమ్మ కనిపిస్తుంది కదా. మరి ఆ నోటు చూసినప్పుడు మీకు కొన్ని సందేహాలు […]
కరెన్సీ నోట్ల మీద బోసి నవ్వుల బాపూ మహాత్మాగాంధీ చిత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే అని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే కొంతమంది గాంధీ బొమ్మను తొలగించి.. ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి నాయకుల చిత్రాలను పెట్టాలని పలువురు కోరుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గాంధీ ముని మనవడు కూడా కరెన్సీ నోట్ల మీద గాంధీ బొమ్మను తొలగించాలని కోరారు. గాంధీ చిత్రాన్ని తొలగించమని గాంధీ కుటుంబానికి […]
భారతదేశానికి జాతిపిత మహాత్మాగాంధీ. ఆయన మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చేందుకు తెల్లవారితో పోరాడారు. శాంతి, అహింస లనే ఆయుధంగా చేసుకుని ప్రాణాలకు తెగించి మరీ బ్రిటీష్ వారితో పారాడినారు. ఆయన పోరాట పటిమతో దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. గాంధీ జీ త్యాగానికి గుర్తుగా ఆయనకు జాతిపిత అనే బిరుదు వచ్చింది. అయితే తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడణవీస్ భార్య అమృత ఫడణవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ఆధునిక భారత జాతిపితగా అమృత […]
కరెన్సీ నోట్ల మీద ఆర్బీఐ గాంధీజీ బొమ్మను ముద్రిస్తుంది. అయితే అప్పుడప్పుడు గాంధీజీ బదులు అంబేడ్కర్ బొమ్మను ముద్రించాలని పలువురు నేతలు డిమాండ్ చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఢిల్లీ సీఎం ఏకంగా కరెన్సీ నోట్ల మీద గాంధీజీ బొమ్మ పక్కనే.. వినాయకుడు, లక్ష్మీ దేవిల బొమ్మలను ముద్రించాలని సూచించాడు. ఆఖరికి ఇండోనేషియా వంటి పరాయి దేశాల్లో కూడా కరెన్సీ నోట్ల మీద వినాయకుడి బొమ్మ […]
రాహుల్ రామకృష్ణ.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని నటుడు. ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో అనదికాలంలోనే టాప్ కమెడియన్గా పేరు తెచ్చుకున్నాడు. ఇక ట్రిపుల్ ఆర్ చిత్రంలో కీలక పాత్రలో నటించాడు రాహుల్ రామకృష్ణ. సినిమాల్లో ఎలాంటి క్యారెక్టర్లు వేసినా.. రియల్ లైఫ్లో మాత్రం.. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్గా ఉంటారు రాహుల్ రామకృష్ణ. స్వయంగా ఆయనే వివాదాలు కొని తెచ్చుకుంటారు. ట్విట్టర్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. నిత్యం వివాదాల్లో నిలిచే రాహుల్ రామకృష్ణ.. మరోసారి అదే […]
తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉంటారు. సందర్భం దొరికిన ప్రతి సారి బీజేపీపై విరుచుకుపడుతుంటారు కేటీఆర్. అలానే బీజేపీని విమర్శిస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో కూడా ముందుంటారు కేటీఆర్. ఇక తాజాగా మోదీని ఉద్దేశిస్తూ.. మరోసారి విమర్శలు చేశాడు కేటీఆర్. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ని టార్గెట్ చేస్తూ కేటీఆర్ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక గతంలో కూడా నిర్మలా సీతారామన్ పర్యటన సందర్భంలో కూడా కేటీఆర్ ఇలానే ట్వీట్ చేశాడు. […]