ఐపీఎల్ 2022 టీమిండియా కెప్టెన్ విరాట్ కోమ్లీ, ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దారుణంగా విఫలం అవుతున్నారు. దీంతో ఐపీఎల్ తర్వాత జరగబోయే సిరీస్లకు వీరికి సెలెక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రోహిత్, కోహ్లీ ఫామ్, రాబోయే టీ20 వరల్డ్ కప్పై స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అత్యుత్తమ ఆటగాళ్లని.. ఐపీఎల్లో వాళ్లు పరుగుల చేయకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దాదా అన్నాడు. టీ20 వరల్డ్ కప్కు ఇంకా ఐదు నెలల సమయం ఉందని.. అప్పటి వరకు వాళ్లు ఫామ్ అందుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్ తర్వాత సౌతాఫ్రికాతో జరగబోయే సిరీస్లో వీరికి విశ్రాంతి ఇచ్చే విషయంపై మాత్రం దాదా ప్రస్తావించలేదు.
రోహిత్ శర్మ కెప్టెన్ కనుక అతని ఆడించి.. కోహ్లీ విశ్రాంతి ఇవ్వనున్నట్లు ఇప్పటికే క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. కాగా.. ఈ సీజన్లో ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడిన రోహిత్.. కేవలం 218 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్లో రోహిత్కు ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు ఇప్పటి వరకు. అలాగే విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 13 మ్యాచ్లు ఆడి 236 పరుగులు చేశాడు. కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ ఉంది. ఇలా ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు ఈ సీజన్లో దారుణంగా విఫలం అయ్యారు. రోహిత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. ఇక ఆర్సీబీ ప్లేఆఫ్కు చేరాలంటే మిగిలిన ఒక్క మ్యాచ్లో కచ్చితంగా గెలిచి.. ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయం కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. మరి రోహిత్, కోహ్లీ ఫామ్పై గంగూలీ స్పందన గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Team India: సౌతాఫ్రికా టూర్కు టీమిండియాలోకి ముగ్గురు IPL యంగ్స్టార్లు
“I’m not worried at all” – BCCI President Sourav Ganguly opens up on Virat Kohli and Rohit Sharma’s struggles in IPL 2022 before T20WC https://t.co/58ZzNoc3oi
— Behind Cricket (@behindCric8) May 17, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.