విశాఖలో దారుణం నెలకొంది. వాలంటీర్ ఓ వృద్ధురాలిని హత్య చేశాడు. ఈ సంఘటన నగరం మొత్తం కలకలం రేపింది. వృద్ధురాలు హత్యగావింపబడినట్లు సీసీ కెమెరాలోని దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో దొంగతనాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. బంగారం ధర ఎక్కువగా పెరిగిపోతుండడంతో గొలుసు దొంగతనాలు ఎక్కువయ్యాయి. ఒంటరి మహిళలనే టార్గెట్ గా చేసి చోరీలకు పాల్పడుతున్నారు. ఇంట్లో బయట ఒంటరిగా వెళ్లాలన్నా భయమేస్తోంది. తెలిసినవారు కూడా అదును చూసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ రోజుల్లో ఎంత తెలిసిన వారైనా కూడా నమ్మేటట్లు లేదు. అసలు నిజాలు తెలిసిన తర్వాత నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. తాజాగా విశాఖలో షాపులో పార్ట్ టైం జాబ్ చేస్తూనే.. యజమాని తల్లిపై దారుణానికి ఒడిగట్టాడు ఓ ప్రబుద్ధుడు. విశాఖలో వృద్ధురాలి హత్య తీవ్ర కలకలం రేపుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
విశాఖలోని పెందుర్తి నియోజకవర్గం పరిధి సుజాతనగర్లో ఓ వృద్ధురాలు నివాసముంటుంది. ఆమె కుమారుడు ఓ షాప్ నిర్వహిస్తునాడు. గ్రామ వాలంటీర్ కొంతకాలంగా వారి షాపులో పార్ట్టైం పనిచేస్తున్నాడు. రాత్రి 10.30 గంటలకు వృద్ధురాలు ఇంట్లో ఉన్న సమయంలో ఆమెను వాలంటీర్ హత్య చేశాడు. నిందితుడు 95వ వార్డు పురుషోత్తపురంలో గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్నాడు. అతని పేరు వెంకటేష్. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పెందుర్తి పోలీసులు, క్లూస్ టీమ్ వెంటనే అక్కడికి చేరుకుని ఆధారాలను సేకరించారు. గ్రామ వాలంటీర్ వృద్ధురాలి ముఖంపై దిండుతో నొక్కి ఊపిరి ఆడకుండా చేసి హత్యగావించినట్లు క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. ఆమెను హత్యచేసి ఒంటిపై ఉన్న బంగారాన్ని దొంగిలించాడు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సీసీ కెమెరాలోని దృశ్యాలను చూస్తే వృద్ధురాలు నివాసముంటున్న ఇంట్లోకి వచ్చి తిరిగి బయటికి వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితున్ని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇది చదవండి: శభాష్ వాలంటీర్.. తన ప్రాణాలను లెక్కచేయకుండా..