భార్యభర్తల బంధం అనేది చాలా సున్నితమైన అంశం. దాంపత్యంలోకి అనుమానం అనే రోగం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో ఇక ఆ బంధానికి కాలం చెల్లినట్టే. ఎప్పుడూ అనుమానించే వ్యక్తిది మాత్రమే కాదు, అనుమానం కలిగేలా ప్రవర్తించే భాగస్వామిది కూడా తప్పు ఉంటుంది. దీనికి తాజాగా జగద్గిరిగుట్టలో జరిగిన సంఘటనే ఉదాహరణ. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రింగ్ బస్తీకి చెందిన మనీష్ గౌడ్(34), పింకి(30)లకు 2012లో వివాహం జరిగింది. వీరికి దేవ్, దీప్లనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే పక్కింటి వ్యక్తితో పింకి చనువుగా ఉండడం గమనించిన మనీష్ తన భార్యను పలుమార్లు హెచ్చరించాడు. భర్త అనుమానిస్తున్నాడని, మందలించాడని ఆమె ఈ నెల 19న తన పిల్లలతో కలిసి ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయింది.
ఫోన్ సైతం ఆమె స్విచ్ఛాఫ్ చేసుకుంది. దీంతో ఆమె కోసం బంధువుల ఇంట్లో వెతికినా ఆచూకీ లభించలేదు. పక్కింట్లో ఉండే వ్యక్తి కూడా అదే రోజు నుంచి కనిపించకపోవడంతో అతడి మీదే అనుమానం ఉందని మనీష్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చనువు అనేది అన్ని సందర్భాల్లో పనిచేయదు. భాగస్వామితో ఉన్నట్టే బయట వ్యక్తులతో ఉంటే భాగస్వామికి, బయట వాళ్లకి తేడా ఉండదు. భాగస్వామికి, బయట వాళ్ళకి తేడాని చూపించే చిన్న గీత ఉంటుంది.
ఆ గీత చెరిగిపోయిన రోజున దాంపత్య జీవితం చిన్నాభిన్నమవుతుంది. ఇది భార్యాభర్తల మీదే కాదు, పిల్లల మీద కూడా ప్రభావం చూపుతుంది. ఈ విషయం తెలియని కొందరు తాత్కాలిక సుఖాల కోసం, తాత్కాలిక ప్రయోజనాల కోసం పండంటి కాపురాన్ని నాశనం చేసుకుంటున్నారు. మరి మందలించాడని భర్తనొదిలేసి వెళ్ళిపోయిన పింకిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.