ప్రస్తుతం సమాజంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్న నేరం చైన్ స్నాచింగ్. నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే కోరికతో.. విలాసాలకు అలవాటు పడ్డ వారు ఈ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలోనే ఉత్తర ప్రదేశ్కి చెందిన ఓ చైన్ స్నాచర్ గురించి విన్నాం. ఇతడు దర్జాగా విమానంలో వచ్చి.. స్నాచింగ్లకు పాల్పడి తిరిగి వెళ్తుంటాడు. వీరిని పట్టుకోవడం కోసం పోలీసులు తీవ్రంగా శ్రమిస్తుంటారు. అయితే ఏపీలో ఇందుకు విరుద్ధమైన సంఘటన చోటు చేసుకుంది. నేరస్తులను పట్టుకోవాల్సిన పోలీసు ఉద్యోగే.. స్నాచింగ్లకు పాల్పడుతూ.. జనాలకు చిక్కాడు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: వీడియో: పోలీసులకే వార్నింగ్ ఇచ్చిన హిజ్రాలు!
కృష్ణా జిల్లాలో ఓ కానిస్టేబుల్ చైన్ స్నాచింగ్ చేస్తూ దొరికిపోయాడు. కైకలూరు సంత మార్కెట్ సమీపంలోని కిరాణా షాపు.. యజమాని భార్య మెడలో గొలుసు తెంచుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. మహిళ పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు అతడిని వెంబడించి పట్టుకున్నారు. అతడి దగ్గర నుంచి రూ. 1,20,000ల విలువైన గొలుసు, బైక్, ఒక చాకు, పెప్పర్ స్ప్రే, స్వాధీనం చేసుకున్నారు. కానిస్టేబుల్ను పోలీసులకు అప్పగించారు.
ఇది కూడా చదవండి: వాహనదారులకు శుభవార్త.. పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ గడువు పొడిగింపు!చైన్ స్నాచింగ్ చేసిన వ్యక్తిని సింగిడి సత్యనారాయణగా గుర్తించారు. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా ఉండి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఈ దొంగతనంలో అతడికి సహకరించిన మరో యువకుడు బుద్ధాల సుభాష్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ స్నాచింగ్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సత్యనారాయణ గతంలో కూడా చైన్ స్నాచింగ్ చేశాడా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.
ఇది కూడా చదవండి: వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత.. చెప్పులు విసిరిన టీఆర్ఎస్ శ్రేణులు!
అప్పులు తీర్చడానికి సత్యనారాయణ చోరీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాను పనిచేస్తున్న పశ్చిమగోదావరి జిల్లాలో దొంగతనాలు చేస్తే అనుమానం వస్తుందని పక్క జిల్లా కృష్ణాలో దొంగతనాలు మొదలుపెట్టాడు. చైన్ స్నాచింగ్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. కానిస్టేబుల్గా పనిచేస్తున్న వ్యక్తి ఇలా గొలుసు దొంగతనాలు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.