సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో భాగంగా దేవాలయంలో అర్చకుడిగా ఉంటూ రాసలీలలు కొనసాగిస్తున్న ప్రధాన అర్చకుడి బండారం వెలుగులోకి వచ్చింది. దేవాలయానికి వచ్చిన మహిళలు, యువతులను తన మంత్రశక్తులతో వశీకరణ చేస్తున్నాడని… ప్రశాంతత కోసం గుడికి వచ్చే వారితో.. పూజారి రాసలీలలు సాగిస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
అనందపురం.. మురడి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకుడిగా ఉంటున్న అనంతశయన అనే పూజారి గుడికి వచ్చిన కొంత మంది ఆడవారిని తన మాటలతో లోబర్చుకొని వారితో లైంగిక కోరికలు తీర్చుకుంటున్నట్లు ఆయన భార్య స్రవంతి. 2008 లో అనంతశయనకు రంగాపురం గ్రామాని చెందిన స్రవంతితో వివాహం జరిగింది. ఈ జంటకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొత్తలో తన తో కాపురం బాగానే చేసినా ఈ మద్య అదనపు కట్నం తీసుకు రావాలని వేధిస్తున్నట్లు స్రవంతి ఆవేదన వ్యక్తం చేసింది.
గత కొంత కాలంగా తన భర్తలో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయని.. పులు అనుమానాలు రేకెత్తించేవిధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడని స్రవంతి ఆరోపిస్తుంది. అంతే కాదు గుడికి వచ్చిన కొంత మంది మహిళలను తన మాయ మాటలు, వశీకరణతో లోబర్చుకోవడమే కాదు.. వారితో లైంగిక కోరికలు కూడా తీర్చుకుంటున్నాడని తెలిపింది. తనకు ఫొటోలు, ఆడియో రికార్డులు దొరికాయని చెప్పారు. ఈ విషయంపై తన భర్తను ప్రశ్నించగా దారుణంగా కొట్టి పుట్టింటికి పంపించి వేశాడని కన్నీరు పెట్టుకుంది. వివిధ కారణాలు చెప్పి తనకు విడాకులు కావాలని లాయర్ నోటీసు కూడా పంపించారని స్రవంతి తెలిపింది.
ఈ విషయం గురించి మాట్లాడాలని తనతో పాటు తన తల్లిదండ్రులు, పెద్ద మనుషులను రమ్మని ఊరికి రమ్మనడంతో నమ్మి వెళ్లామని.. గుడిలో కాదు వేరే చోట మాట్లాడుకుందాం అని చెప్పి కొంత మంది రౌడీలతో తమపై దాడి చేయించారని తనను హతమార్చేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు స్రవంతి తెలిపారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: Pit Bull Dog: వైరల్! తల్లిని చంపిన పెంపుడు కుక్కను ఆప్యాయంగా సాగనంపిన కొడుకు
ఇది చదవండి: Tirupathi: తండ్రే తగలెట్టాడు.. అయినా! చనిపోయే ముందు తండ్రిని చూడాలంటూ..