Tokenisation: త్వరలో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు రూల్స్ మారనున్నాయి. కార్డ్ ఆన్ ఫైల్ టోకనైజేషన్ అమల్లోకి రానుంది. అక్టోబర్ 1నుంచి ఈ టోకనైజేషన్ అమలుకానుంది. కొత్తగా ప్రవేశపెట్టబోయే టోకనైజేషన్ పద్దతి కారణంగా కార్డుదారులకు సంబంధించిన పేమెంట్స్ మరింత భద్రతతో, సులభతరమవుతాయని భారతీయ రిజర్వ్ బ్యాంకు తెలిపింది. ఆన్లైన్ పేమెంట్స్ సందర్భంగా కార్డుదారుల సమాచారం ఎన్క్రిప్టెడ్ టోకెన్గా స్టోర్ చేయబడుతుందని, తద్వారా లావాదేవీ సులభతరం అవుతుందని పేర్కొంది.
అసలు టోకనైజేషన్ అంటే ఏమిటి?
ఆర్బీఐ ప్రకారం టోకనైజేషన్ అంటే.. ఆన్లైన్ లావాదేవీల సమయంలో ఇచ్చిన కార్డు వివరాలను ఒక ప్రత్యామ్నాయ కోడ్ ‘టోకెన్’తో రీప్లేస్ చేయటం. టోకనైజేషన్ ప్రకారం అన్ని కంపెనీలు తమ డేటా బేస్లో స్టోర్ చేసుకున్న కార్డుదారుల సమాచారాన్ని డిలేట్ చేయాల్సి ఉంటుంది. వాటి స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన టోకెన్ను వాడుకోవాలి. ఒకసారి టోకనైజేషన్ అమల్లోకి వస్తే గనుక వ్యాపారులు తమ డేటా బేస్లో కార్డు సమాచారాన్ని సేవ్ చేసుకోవటానికి అవకాశం ఉండదు. దీని వల్ల ఆన్లైన్ లావాదేవీలు మరింత సురక్షితం అవుతాయని ఆర్బీఐ పేర్కొంది.
ఇవి కూడా చదవండి : 17 బ్యాంకుల డిపాజిటర్లకు శుభవార్త.. త్వరలోనే చేతికి రూ.5 లక్షలు!