17 కో-ఆపరేటివ్ బ్యాంక్ డిపాజిటర్లకు ఓ శుభవార్త అందింది. త్వరలోనే అర్హులైన డిపాజిటర్లు అందరికి రూ.5 లక్షల వరకు చేతికి రానున్నాయి. దేశంలోని 17 కో-ఆపరేటివ్ బ్యాంక్లకు చెందిన డిపాజిటర్లకు చెల్లింపులు చేసేందుకు డీఐసీజీసీ(డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్) అంగీకరిచింది. ఈ 17 కోపరేటివ్ బ్యాంకుల్లో 8 మహారాష్ట్ర, 4 ఉత్తర ప్రదేశ్, 2 కర్ణాటక, 1 ఏపీ, 1 న్యూఢిల్లీ, 1 బెంగాల్కు చెందినవి. ఈ 17 కో-ఆపరేటివ్ బ్యాంక్ల లైసెన్సులు రద్దు కావడం, దివాలా తీయడం వంటి సందర్భాల వల్ల డిపాజిటర్ల డబ్బు అలాగే ఉండిపోయింది. జులై నెలలో ఆర్బీఐ బ్యాంకులపై నిషేదం విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ బ్యాంకులకు చెందిన అందరు అర్హులైన డిపాజిటర్లకు డబ్బు అందబోతోంది. గరిష్టంగా రూ.5 లక్షల వరకు డీఐసీజీసీ చెల్లింపులు చేయనుంది. ఆ బ్యాంకులు ఏవంటే.. అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (సితాపూర్), అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (లక్నో), బహ్రైచ్ లోని నేషనల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, యునైటెడ్ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్, కర్ణాటకకు చెందిన మల్లికార్జున పట్టణ కో-ఆపరేటివ్ బ్యాంక్, తుమకుర్లోని శ్రీ శారద మహిళా కో-ఆపరేటివ్ బ్యాంక్, సురిఫ్రెండ్స్ యూనియన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (బెంగాల్), రామ్గర్హియా కో-ఆపరేటివ్ బ్యాంక్(న్యూఢిల్లీ), దుర్గా కో-ఆపరేటివ్ బ్యాంక్(విజయవాడ) బ్యాంకుల డిపాజిటర్లు ఉన్నారు. మనకి ఎలాగైతే హెల్త్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్ వంటివి ఉంటాయో.. అలాగే బ్యాంకులకు కూడా బీమా ఉంటుంది. ఏదైనా సందర్భంలో బ్యాంకు లైసెన్స్ రద్దయినా, ఆ బ్యాంక్ దివాలా తీసినా ఈ డీఐసీజీసీ అనే కార్పొరేషన్ అర్హులైన డిపాజిటర్లకు రూ.5 లక్షల వరకు చెల్లింపులు చేస్తారు. డీఐసీజీసీ డిపాజిటర్లకు ఇన్సూరెన్స్ కవర్ అందిస్తుంది. 17 బ్యాంకు డిపాజిటర్లకు డబ్బు అందడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: యూపీఐ సేవలపై ఛార్జీల మోత.. కేంద్రం ఏమన్నదంటే! ఇదీ చదవండి: మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI.. మరి డిపాజిట్దారుల పరిస్థితి ఏంటి?