టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తమ వినియోగదారులకు మరో సరికొత్త ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏ టెలికాం సంస్థ అయినా ఇప్పుడు నెల రోజుల వ్యవధి ప్లాన్లను అందించడం లేదు. అందరూ 28 రోజులు, 24 రోజుల టారిఫ్ లనే అందిస్తున్నారు. ఇక నుంచి జియోలో నెల రోజుల ప్లాన్ ఉండబోతోంది. ఈ ప్లాన్ లో ప్రతినెల ఒకే తేదీన రిఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్లాన్ పూర్తి వివరాలు ఏంటో చూద్దాం.
ఇదీ చదవండి: యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పనున్న వాట్సాప్.. ఇక నుంచి లిమిట్ పెంపు!
ప్లాన్ విషయానికి వస్తే.. రూ.259 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్ లు లభిస్తాయి. ఇంక రీఛార్జ్ విషయానికి వస్తే ఈ ప్లాన్ లో రోజులతో సంబంధం లేదు. అంటే ఒక నెలకు 30 రోజులు, మరో నెలకు 31 రోజులు ఉంటాయి. అలా సంబంధం లేకుండా ప్రతినెలా ఒకే రోజు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మార్చి నెల 28న రూ.259తో రీఛార్జ్ చేసుకుంటే మళ్లీ ఏప్రిల్ 28న తిరిగి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే ముందే మీరు రీఛార్జ్ చేసుకుంటే పాత ప్లాన్ గడువు ముగియగానే ఆటోమేటిక్ గా కొత్త రీఛార్జ్ యాక్టివేట్ అవుతుంది.టెలికాం సంస్థల తీరుపై వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. ట్రాయ్ కూడా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. 60 రోజుల్లోగా మంత్లీ టారిఫ్ ప్లాన్లు రావాలని కూడా చెప్పింది. అందులో భాగంగానే రిలయన్స్ జియో ఈ ప్లాన్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ట్రాయ్ చెప్పిన తర్వాత నెల రోజుల ప్లాన్ తీసుకొచ్చిన మొదటి టెలికాం సంస్థ జియోనే. ఈ ప్లాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Jio launches Rs 259 prepaid recharge plan with one month (30 days) validity#jio #jioplan #jionewplan #jiorecharge pic.twitter.com/nvZqC5AHQP
— Geekman (@GeekmanOfficial) March 28, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.