టెలికాం రంగంలో సంచనంగా మారిన రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపింది. రూ. 999 ధరకే 4G ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్ జియో ఫోన్ పేరిట లాంచ్ చేసింది. దీనికి సంబంధించిన ఫీచర్స్ ఇలా ఉన్నాయి.
భారత టెలికాం రంగంలో పెను సంచలనంగా దూసుకొచ్చిన రిలయన్స్ జియో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అంధించాలనే లక్ష్యంతో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంది. జియో నెట్ వర్క్ ప్రారంభించిన మొదట్లో ఉచిత డేటా, కాలింగ్ తో లక్షాలాది కస్టమర్లను పోగేసుకున్నది. ఆ తర్వాత తక్కువ ధరలకే ప్లాన్స్ ప్రారంభించి మిగతా టెలికాం కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చింది. టెలికాం రంగంలో జియో దెబ్బకు మిగతా నెట్ వర్క్స్ చతికిలపడ్డాయి. తక్కువ ధరకే జియో ఫోన్లను మార్కెట్ లోకి తీసుకు వచ్చి హిస్ట్రీ క్రియేట్ చేసింది. ఇప్పటికీ దేశంలో 25 కోట్లకు పైగానే జియో ఫోన్లను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో రిలయన్స్ జియో మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. అతి తక్కువ ధరకే 4జి ఫోన్ ను అందించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన విషయాలను వెల్లడించింది. ఆ వివరాలేంటో చూద్దాం.
ప్రముఖ టెలికాం కంపెనీ అయిన రిలయన్స్ జియో ‘జియో భారత్ 4జీ ఫోన్’ ను లాంఛ్ చేసింది. దీని ధరను రూ.999 గా నిర్ణయించింది. జియో భారత్ 4జీ ఫోన్ సంవత్సరానికి రూ.1,234తో రిచార్జ్ చేసుకునేలా సరికొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. అదే నెలవారిగా రూ.123తో రీచార్జ్ చేసుకుంటే అపరిమిత వాయిస్ కాల్స్, నెలకు 14జీబీ డేటా లభిస్తుంది. 10 లక్షల మందికి జియో భారత్ ఫోన్ బీటా ట్రయల్ 2023 జూలై 7న ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. ఇక జియో భారత్ 4జీ ఫోన్ ను కార్బన్ కంపెనీ తయారు చేసింది. ఈ ఫోన్ 1000 ఎంఎహెచ్ బ్యాటరీతో, 1.7 అంగుళాల క్యూవీజిఎ డిస్ ప్లే తో వస్తోంది. ఇన్ బిల్ట్ జియో సిమ్ తో పాటు జియో సినిమా, జియో సావన్ వంటి యాప్స్ ప్రీ ఇన్ స్టాల్డ్ గా ఉండనున్నాయి.