రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం నాడు తన ద్రవ్య పరపతి విధాన సమీక్ష తర్వాత నిర్ణయాలను ప్రకటించింది. రెపోరేట్లను యథాతథంగా ఉంచి.. పలు కీలక ప్రకటనలు చేసింది. దీంతో
మరోమారు మంగళవారం నుండి మూడురోజులుగా సమావేశమైన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ తన నిర్ణయాలను గురువారం ప్రకటించింది. పోయిన సంవత్సరం మే నుండి 250 బేసిస్ పాయింట్లకు రెపోరేటును కేంద్ర బ్యాంక్ పెంచింది. తాజాగా వరుసగా మూడోసారి రెపోరేట్లను యథాతథంగా ఉంచింది. ప్రస్తుతానికి 6.50% వద్ద కొనసాగుతోంది. ద్రవ్యోల్బణం అంచనాలను పెంచింది. కూరగాయల రేట్లు పెద్ద మొత్తంలో పెరుగుతున్న కారణంగా ధరల స్థిరీకరణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. రుణ గ్రహీతలకు ఆర్ బీఐ శుభవార్తను తెలిపింది. దీంతో గృహ రుణాలు, వాహన కొనుగోలు, ఇతర దీర్ఘకాలిక రుణ గ్రహీతలకు ఊరట కలుగనుంది. ప్రజెంట్ ఉన్న ఫ్లోటింగ్ వడ్డీ రేట్ల నుండి స్థిర వడ్డీకి మారేందుకు వీలు కల్పిస్తామని తెలిపింది.
ముందస్తు చెల్లింపులకు కూడా అవకాశం కల్పిస్తుంది. ఆయా ఛార్జీలను బ్యాంకులు పారదర్శకంగా, స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఇది ఓ రకంగా వినియోగదారులకు అనుకూల వ్యవస్థ అని చెప్పవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనంతరం కీలక నిర్ణయాలను ప్రకటించింది. కీలక నిర్ణయాలను ప్రకటించే సమయంలోనే ఈ విషయాన్ని కూడా తెలిపింది. ఎటువంటి క్రెడిట్ హిస్టరీ లేకున్నా రుణాలు తీసుకునేందుకు ఇన్నోవేటివ్ సిస్టమ్ దోహదం చేస్తుందని తెలిపారు. ఇప్పటినుండి ఈ ప్లాట్ఫాం రుణాలు పొందేందుకు ఈజీగా ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
కిసాన్ క్రెడిట్ కార్డుపై లోన్స్ ఇచ్చేందుకు ఆర్ బీఐ, ఆర్ బీఐ ఇన్నోవేషన్ హబ్ ఒక పైలట్ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేసింది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలలో పైలట్ ప్రాజెక్ట్ మొదలైంది. దీనితోనే కొత్త పబ్లిక్ టెక్ ప్లాట్ఫాం డెవలప్ చేయనున్నారు. ముఖ్యంగా రైతులు, డెయిరీ ఫార్మ్స్ నడిపే వారు క్రెడిట్ హిస్టరీ లేక రుణాలు తీసుకోవడం కష్టతరం అవుతోందని ఆర్ బీఐ తెలిపింది. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకుల వద్ద డబ్బుందని, ప్రస్తుతం లిక్విడిటీ సరిపోతుందని ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. 2022 జూన్ నుండి ఈ ఆగస్ట్ నాటికి ఆర్థిక వ్యవస్థలో రూ.2.48 లక్షల కోట్ల అదనపు ద్రవ్యలభ్యత ఉన్నట్లు గణాంకాలు తెలిపాయన్నారు.