జీవితంలో గొప్ప స్థానానికి ఎదగాలన్నా.. బాగా సంపాదించాలన్న గొప్ప గొప్ప చదువులతో పాటు.. తన చుట్టు ఉన్నా పరిస్థితిల గురించి.. కాలానికి తగ్గట్టు మారుతున్న అవసరాల గురించి పూర్తిగా అవగాహన ఉండాలి. ఈ రెండు లక్షణాలు ఉంటే.. గొప్ప గొప్ప డిగ్రీలు లేకపోయినా సరే వ్యాపారంలో విజయం సాధించవచ్చు. ఇప్పుడు మీరు చదవబోయే సక్సెస్ స్టోరీ కూడా ఈ కోవకు చెందినదే. చదువు మీద శ్రద్ధ లేదు.. ఏదో ఓ పని చేసి డబ్బు సంపాదించాలి. ఇదే ఆలోచన. కట్ చేస్తే.. చిన్న కిరాణ షాపు ఓనర్ కొడుకైనా.. ఆ వ్యక్తి 18వ ఏట బిజినెస్ ప్రారంభించాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. ఇప్పుడు 9 వేల కోట్లకు అధిపతి అయ్యాడు. అతడే ఓయో రూం వ్యవస్థాపకుడు, సీఈఓ రితేష్ అగర్వాల్. అతడి వ్యాపార ప్రస్తానం ఎందరికో ఆదర్శం.
ఒడిశా రాయగడ జిల్లాకు చెందిన రితేష్ తల్లిదండ్రులు కిరాణ షాపు నడిపి.. కుటుంబాన్ని పోషించేవారు. రితేష్కు చిన్నప్పటి నుంచి ఏదో పని చేసి డబ్బు సంపాదించాలని కోరిక. అందుకే 13వ ఏట నుంచే మొబైల్ సిమ్ కార్డులు అమ్మడం ప్రారంభించాడు. అలా పని చేసుకుంటూనే స్కూల్ చదువు పూర్తి చేశాడు. తర్వాత ఢిల్లీ వెళ్లి కాలేజీలో జాయిన్ అయ్యాడు. అక్కడ కూడా చదువు మీద కన్నా సంపాదన మీదే దృష్టి మరలింది. దాంతో కాలేజ్ చదువును మధ్యలోనే ఆపేసి.. 2012లో ఒరావెల్ సెస్ట్ పేరిట హోటల్ బుకింగ్ పోర్టల్ స్థాపించాడు. అప్పుడు అతడి వయస్సు 17 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత ఓ కాంపిటీషన్లో స్కాలర్ షిప్ గెల్చుకుని.. ఆ డబ్బుతో 2013లో ఓయో రూమ్స్(ఓన్ యువర్ ఓన్) స్థాపించాడు. అప్పుడు అతడి వయసు 18 ఏళ్లు మాత్రమే.
Ritesh Agarwal is the #founder and #CEO of the world’s most pocket-friendly #hospitality and app- #OYO #Rooms which is a network of 2,200 #hotels operating in 154 cities.
Read Full Article Here:https://t.co/hV6bEhGQMk pic.twitter.com/LgCqaDQBPY
— Business Connect Magazine (India) (@BusinessConne16) June 1, 2022
ఇది కూడా చదవండి: Successful Story: రైతుగా మారిన.. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కథ! ఈమె దేశానికే స్ఫూర్తి!
ఆ తర్వాత వ్యాపారం నెమ్మదిగా పుంజుకుంది. ప్రసుత్తం ఇండియా వ్యాప్తంగా విస్తరించింది. ప్రస్తుతం దీన్ని యూరప్, అమెరికాలో కూడా విస్తరించే పనిలో ఉన్నాడు. రితేష్ గురించి తెలుసుకున్న ట్రంప్.. ఇండియా వచ్చినప్పుడు.. అతడిని పిలిపించుకుని మరి మాట్లాడాడు. ప్రధాని, రాష్ట్రపతి, అధాని అందరూ అతడిని ప్రశంసించారు. ప్రస్తుతం రితేష్ వయసు 28 సంవత్సరాలు. అతడి ఆస్తి 8750 కోట్లు. కరోనా ముందు వరకు 1000 కోట్ల వరకు ఉండేది. కానీ మహమ్మారి ఫలితంగా తగ్గిపోయింది. గొప్ప చదువులు లేకపోయినా.. తనపై నమ్మకంతో.. స్వయంకృషితో బిలియనీర్గా ఎదిగిన రితేష్.. ప్రతి ఒక్కరికి ఆదర్శం.
Can the rise in revenge travel post COVID-19 pandemic unlock the business opportunities for startups like OYO Rooms? Ritesh Agarwal, CEO, OYO Rooms explains. | @RahulKanwal @riteshagar @midc_india @midc_ceo @CoinDCX #WEF #BTAtWEF #BTDavos #DavosWithBT pic.twitter.com/AFZBE2dFfP
— Business Today (@business_today) June 2, 2022