మట్టితో పని లేకుండా వ్యవసాయం చేస్తున్న హైదరాబాద్ రైతు గురించి మీకు తెలిసే ఉంటుంది. హైడ్రోపోనిక్ ఫార్మింగ్ పద్ధతి ద్వారా మట్టి కాన్సెప్ట్ లేకుండా సాగు చేస్తూ ఏటా రూ. 48 లక్షల నుంచి రూ. 72 లక్షలు సంపాదిస్తున్నారు హైదరాబాద్ కి చెందిన సత్యనారాయణ. పెద్ద పెద్ద నగరాల్లో సేంద్రీయ వ్యవసాయం చేయడానికి భూమి దొరక్క చాలా మంది తమ ఇంటి టెర్రస్ మీద ఆధునిక పద్ధతుల్లో సాగు చేసుకుంటున్నారు. ఆర్గానిక్ వెజిటేబుల్స్ కి బయట మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది. ఎటువంటి రసాయనాలు కలపకుండా సేంద్రీయ పద్ధతిలో సహజంగా పండించిన కూరగాయలు, పండ్లు ఆరోగ్యానికి మేలైనవి కాబట్టి వీటికి డిమాండ్ ఎక్కువ. అందుకే వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది.
అందుకే చాలా మంది రైతులు సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తూ లాభాల బాట పడుతున్నారు. తాజాగా మరొక రైతు తన ఇంటి మీద కూరగాయల సాగు చేస్తూ ఏటా 70 లక్షలు సంపాదిస్తున్నారు. అతనెవరో కాదు, ఉత్తర ప్రదేశ్ కి చెందిన రామ్ వీర్ సింగ్ అనే రైతు. ఒకప్పుడు జర్నలిస్ట్ గా పని చేసిన ఈయన.. వింపా ఆర్గానిక్ అండ్ హైడ్రోపోనిక్స్ అనే స్టార్టప్ ని ప్రారంభించి.. ఇప్పుడు ఎంతోమంది రైతులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. హైడ్రోపోనిక్ పద్దతి ద్వారా ఈయన తన ఇంటిని వ్యవసాయ క్షేత్రంగా మలచుకున్నారు. ఈ పద్ధతితో సాగు చేసేందుకు మట్టి అవసరం లేదని, 90 శాతం నీటిని పొదుపు చేయవచ్చునని రామ్ వీర్ సింగ్ వెల్లడించారు.
ఈ పద్ధతిలో సాగు చేయడం వల్ల తెగులు సోకే అవకాశాలు కూడా తక్కువేనని అంటున్నారు. అందుకే కెమికల్స్ కూడా వాడాల్సిన పని లేదు. పీవీసీ పైపుల సహాయంతో బాల్కనీలో, ఓపెన్ ప్రదేశాల్లో, చిన్న చిన్న ఖాళీ స్థలాల్లో సెటప్ చేసుకుని వ్యవసాయం చేయవచ్చు. ఈ విధానాన్ని సెటప్ చేసుకునేందుకు ఇతర రైతులకు రామ్ వీర్ సహాయం చేస్తున్నారు. ఎలాంటి మట్టి, కెమికల్స్ అవసరం లేకుండా సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. స్ట్రా బెర్రీ, కాలీ ఫ్లవర్, బెండకాయలు వంటి 10 వేల రకాల మొక్కలను 3 అంతస్తుల్లో లేయర్స్ గా వేసి పండిస్తున్నారు. ఇలా తాను పండించే ఆరోగ్యవంతమైన కూరగాయలు, పండ్ల సాగు పట్ల చాలా గర్వంగా ఉందని, సంతోషంగా కూడా ఉందని రామ్ వీర్ సింగ్ అంటున్నారు.
This man earns 70 lakhs growing vegetables in a 3 storey house without soil or chemicals.#growingvegetables #housegardening #chemicalfree #jounalist #uttarpradesh pic.twitter.com/aZ3N6KFCWN
— The Better India (@thebetterindia) October 20, 2022