ప్రస్తుతం చమురు, ఎల్పిజి గ్యాస్ ధరలు ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఎల్పీజీ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1000కి చేరువలో ఉంది. ఇంకోసారి సిలిండర్ ధర పెంపు ఉంటే మాత్రం 1000 రూపాయలకి పైనే చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ తరుణంలో.. ఈ వార్త సామాన్యులకు కొంచెం ఉపశమనం కలిగించవచ్చు. ఇక నుంచి సబ్సిడీ గ్యాస్ తీసుకునే వినియోగదారులు సిలిండర్ కొనుగోలుపై రూ.300 వరకు ఆదా చేయవచ్చు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మధ్యతరగతి కుటుంబాలకు వంటగది ఖర్చులు ఆదా కానున్నాయి. ఏడాది క్రితం వరకు డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ రూ.594 కి లభించేది. ప్రస్తుతం అదే సిలిండర్ ధర 952 రూపాయలకు చేరింది. దీని వల్ల సామాన్యులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ఎల్పిజి గ్యాస్ ధరల కారణంగా చాలా మంది మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యుల అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇచ్చే మినహాయింపును పెంచాలని నిర్ణయించింది. కొంత కాలంగా సిలిండర్ల కొనుగోలుపై వచ్చే సబ్సిడీ మొత్తం రూ.20-30కి కుదించారు. ఇప్పుడు మళ్లీ దాదాపు రూ.300కి పెంచారు. ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్ తీసుకున్న వారు ఈ సబ్సిడీ పథకం నుంచి ఎక్కువ మొత్తంలో ప్రయోజనం పొందుతారు. ఈ పథకం కింద ఉన్న వినియోగదారులకు గతంలో రూ.174.86 సబ్సిడీ లభిస్తుండగా.. ఇప్పుడు దానిని 312.48 రుపాయలకు పెంచారు. దేశీయ వంటగది కొనుగోలుపై గతంలో రూ. 153.86 ఉన్న సబ్సిడీ మొత్తాన్ని ఇప్పుడు రూ. 291.48కి పెంచారు.
ఇది కూడా చదవండి: రూ.11 వేల పెట్టుబడితో.. కోటి రూపాయలు సంపాదించింది!
మీరు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కొనుగోలుపై రూ.300 వరకు సబ్సిడీని పొందాలనుకుంటే, వీలైనంత త్వరగా మీ సబ్సిడీ బ్యాంక్ ఖాతాను మీ ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోవాలి. దీని కోసం మీరు ఇండేన్ ఎల్పిజి గ్యాస్ వినియోగధారులైతే ఈ సైట్ ని.. సందర్శించడం ద్వారా మొత్తం సమాచారాన్ని పొందవచ్చు. భారత్ గ్యాస్ వినియోగదారులు అయితే ఈ సైట్ ని సందర్శించవచ్చు. హెచ్ పి గ్యాస్ వినియోగధారులైతే ఈ సైట్ ని.. సందర్శించడం ద్వారా మొత్తం సమాచారాన్ని తెలుసుకోవచ్చు. వినియోగదారులు సంబంధిత బ్యాంకును సందర్శించడం ద్వారా మీరు మీ ఆధార్ కార్డ్ని మీ సబ్సిడీ బ్యాంక్ ఖాతాతో నేరుగా లింక్ చేయవచ్చు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి