లీటర్ పెట్రోల్ పై 12 రూపాయల తగ్గింపా? ఏంటి నిజమే. ఈరోజుల్లో ఒక్క రూపాయి తగ్గించడమే కష్టం.. అలాంటిది రూ. 12 తగ్గించడమా? ఛాన్సే లేదనుకుంటున్నారా? అయితే మీరు ఈ కథనం చదవాల్సిందే. లీటర్ పెట్రోల్ ని కేవలం వంద రూపాయలకే..
దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. పెరుగుతున్న ఈ ధరలకు సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒక్క రూపాయి తగ్గినా కూడా కోటి రూపాయలు కలిసొస్తుందనుకునే మిడిల్ క్లాస్ బతుకులు మనవి. అలాంటిది పెట్రోల్ పై రూ. 12 తగ్గుతుందంటే ఎవరు మాత్రం ఆగుతారు. పెట్రోల్ బంకు దగ్గర క్యూ కట్టేస్తారు. అసలు ఈరోజుల్లో ఒక్క పైసా కూడా తగ్గించని మనుషులున్నారు. అటువంటిది ఏకంగా లీటర్ పెట్రోల్ పై 12 రూపాయలు తగ్గించారో బంకు యజమాని. దీంతో జనాలు ఎగబడి మరీ బంకు దగ్గరకు వచ్చి లీటర్ రూ. 100 చొప్పున వాహనాల్లో కొట్టించుకుని వెళ్లారు. ఇంతకీ ఆ బంకు ఎక్కడుంది? ఆ వ్యక్తి ఎవరంటే?
నిన్న ఏపీలో లీటర్ పెట్రోల్ రూ. 112 ఉంది. ఇందులో 12 రూపాయల సబ్సిడీ ఇస్తూ వంద రూపాయలకే పెట్రోల్ అందించారు. సంవత్సరంలో 365 రోజులు పెట్రోల్ ధరల భారం మోస్తున్న సామాన్యుల క్యాలెండర్ నుంచి ఒక రోజు భారాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు బంకు యజమాని. ఆయన ఎవరో కాదు.. తిరుపతికి చెందిన డాలర్స్ గ్రూప్స్ అధినేత డాలర్స్ దివాకర్ రెడ్డి. ఆయన తన పుట్టిన రోజు సందర్భంగా జూలై 28న ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ లీటర్ పెట్రోల్ ని 100 రూపాయలకే అందించారు. చంద్రగిరి, తిరుచానూరు ప్రాంతాల్లో ఉన్న డాలర్స్ దివాకర్ రెడ్డి పెట్రోల్ బంకుల వద్ద నిన్న ఒక్కరోజు పెట్రోల్ పై డిస్కౌంట్ ఇచ్చారు.
ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ 12 గంటల పాటు 12 రూపాయల తగ్గింపుతో పెట్రోల్ ఇవ్వాలని నిర్ణయించారు. కాకపోతే ఒక గంట ఆలస్యం కావడంతో ఉదయం 9 గంటల నుంచి మొదలుపెట్టారు. ఒక వాహనానికి 5 లీటర్లు మాత్రమే.. లీటర్ కి 100 రూపాయల చొప్పున తగ్గిస్తామని నిన్న ఒక్క రోజు ప్రకటించడంతో అనేక మంది బంకుల దగ్గర బారులు తీరారు. ఒక్కరోజైనా గానీ తమకు తగ్గింపు ఇవ్వడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రజల కోసం ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని కోరుకుంటున్నారు. పెట్రోల్ పై ప్రభుత్వాలే అంత సబ్సిడీ ఇవ్వవు. అలాంటిది ఒక బంకు యజమాని ఒకరోజు ఇలా డిస్కౌంట్ ఇవ్వడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి పుట్టినరోజు సందర్భంగా లీటర్ పెట్రోల్ పై రూ. 12 తగ్గింపు ఇచ్చిన బంకు యజమానిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.