హైదరాబాద్ లేదా వైజాగ్.. ఈ రెండు నగరాల్లో స్థలం ఎక్కడ కొంటే బాగుంటుంది. పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి ఎక్కడ ఉంటుంది? డబ్బు పరంగా, స్థలం పరంగా ఎక్కువ ప్రయోజనాలు ఏ నగరానికి ఉన్నాయి? అనే వివరాలు మీ కోసం.
హైదరాబాద్ అభివృద్ధి చెందిన మహా నగరం.. ఇక వైజాగ్ అభివృద్ధి చెందుతున్న నగరం. ఈ రెండు నగరాల్లో ఎక్కడ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం ఉంటుంది? హైదరాబాద్ లో ల్యాండ్ రేట్లు ఎలా ఉన్నాయి? వైజాగ్ లో రేట్లు ఎలా ఉన్నాయి? అసలు హైదరాబాద్, వైజాగ్ పోలిక ఎందుకు అని అనుకుంటున్నారా? తెలుగు రాష్ట్రాలు విడిపోయినా గానీ చాలా మంది ఏపీ వాళ్ళు హైదరాబాద్ లోనే ఉద్యోగం చేసుకుంటున్నారు. ఇక్కడే అద్దె ఇళ్లలో ఉంటున్నారు. కొంతమంది ఫ్లాట్ లు కొనేసుకుని అందులో ఉంటున్నారు. అయితే వచ్చిన డబ్బుని స్థలాల మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు హైదరాబాద్ మంచిదా? లేక సొంత ఊరు బెటరా? అన్న సందేహం వస్తుంటుంది. అలాంటి సందేహాలు ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు.
వైజాగ్ తో పోలిస్తే హైదరాబాద్ లో స్థలం రేట్లు ఎక్కువే. మధ్యతరగతి వాళ్లకి కొనడం కష్టమే. కొన్నా గానీ మరీ ఎక్కువ లాభాలు అయితే రావు. హైదరాబాద్ లో ల్యాండ్ రేట్లు తక్కువగా ఉన్న ఏరియాలు కూడా ఉన్నాయి. కానీ సిటీకి దూరం. పెట్టుబడి పెట్టేవారికి దూరంతో పనేముంటుంది చెప్పండి. కానీ పెట్టుబడి, వచ్చే రాబడి లెక్కిస్తే హైదరాబాద్ లో కంటే వైజాగ్ లోనే పెట్టుబడి పెట్టడం ఉత్తమం అనిపిస్తుంది. జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్ ఏరియాల్లో గజం లక్షల్లో ఉంటుంది. మిగతా ఏరియాల్లో గజం రూ. 50 వేలకు తక్కువకి లేవు. రూ. 50 లక్షలు పెడితేనే గానీ 100 గజాల స్థలం రావడం లేదు. ఇదే ధరకు ఏపీలో దగ్గర దగ్గర 600 గజాల స్థలం వస్తుంది.
వైజాగ్ లో పరవాడలో చదరపు అడుగు రూ. 950 పలుకుతోంది. అంటే గజం రూ. 8,550 పలుకుతోంది. రూ. 9 వేలు, రూ. 10 వేలు రేంజ్ లో గజం స్థలం దొరుకుతుంది. అంటే ఒక సెంటు స్థలం రూ. 4 లక్షలు పైనే. ఒక కుటుంబం ఉండడానికి 3 సెంట్లు ఖాళీ స్థలం సరిపోతుంది కాబట్టి రూ. 12 లక్షలు అవుతుంది. రూ. 12 లక్షల్లో వైజాగ్ కి 20 కి.మీ. దూరంలో ఉన్న పరవాడలో 3 సెంట్లు స్ధలం వస్తుంది. ఇదే డబ్బుతో హైదరాబాద్ లో స్థలం కొనాలంటే సిటీ దాటి 50, 60 కి.మీ. వెళ్ళాలి. సంగారెడ్డిలో నిమ్జ్ సమీపంలో గజం రూ. 7 వేలు, రూ. 8 వేలు రేంజ్ లో ఉన్నాయి. ఇక్కడ తప్ప మిగతా ఏరియాల్లో ఎక్కడ చూసినా గానీ సెంటు రూ. 20 లక్షలకు తక్కువ లేదు. అన్నీ రూ. 20 లక్షల పైనే. లక్ బాగుంటే ఎక్కడో ఓ మూలన రూ. 12 లక్షలకు 3 సెంట్ల స్థలం దొరకచ్చు. అది కూడా ఎక్కడో సిటీకి మూలన.
రేట్లు ఎంత పెరుగుతాయో తెలియదు. భారీగా అయితే పెరగవు. ఇల్లు కట్టి రెంట్లుకి ఇచ్చినా సుఖం ఉండదు. పోనీ ఉందామన్నా డైలీ జర్నీ కష్టమైపోతుంది. దీని కంటే వైజాగ్ కి దగ్గరలో ఉన్న పరవాడలో కొనుక్కోవడం మంచిది. పరవాడ ఒక్కటే కాదు.. సబ్బవరం, దువ్వాడ, లంకెలపాలెం, ఆనందపురం, మధురవాడ, అచ్యుతాపురం, కాపులుప్పాడ, శొంఠ్యాం, దాకమర్రి వంటి ఏరియాల్లో స్థలం కొనుక్కున్న మంచి లాభాలు ఉంటాయి. హైదరాబాద్ తో పోలిస్తే తక్కువ ధరకు ఎక్కువ స్థలం వస్తుంది. అలానే ఎక్కువ లాభాలు వస్తాయి. 50 లక్షలకు హైదరాబాద్ లో 100 గజాల స్థలం వస్తే.. అదే 50 లక్షలకు వైజాగ్ లో 576 గజాల స్థలం వస్తుంది. 100 గజాలు ఎక్కడ.. 576 గజాలు ఎక్కడ? వైజాగ్ ఎప్పటికీ ఇపుడున్నట్టే ఉంటుందా? ఇప్పుడు పరవాడలో గజం రూ. 8,550 నుంచి రూ. 10 వేల రేంజ్ లో ఉంది.
వైజాగ్ కి 20 కి.మీ. దూరంలో ఉంది. వైజాగ్ హైదరాబాద్ రేంజ్ లో డెవలప్ అవ్వడానికి ఎంతో సమయం పట్టదు. అప్పుడు వైజాగ్ లో ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. కాబట్టి హైదరాబాద్ స్థలం మీద పెట్టుబడి పెట్టడం కంటే వైజాగ్ స్థలాల మీద పెట్టుబడి పెట్టడం ఉత్తమం. హైదరాబాద్ లోని కూకట్ పల్లి లో కొన్ని చోట్ల గజం రూ. 50 వేలు ఉంటే.. వైజాగ్ లోని మధురవాడ, పోతినమల్లయ్య, శ్రీనివాసనగర్ ఏరియాల్లో గజం రూ. 68 వేలు పలుకుతోంది. ఈ రేట్లు అంతంత మాత్రంగా డెవలప్ అయితేనే ఇలా ఉంటే.. ఫుల్ గా డెవలప్ అయితే ఈ రేట్లు బాగా పెరిగిపోతాయి. స్మార్ట్ సిటీగా వైజాగ్ డెవలప్ అవుతోంది. ఏపీ వారికి వైజాగ్ పెద్ద దిక్కు కాబోతుంది. తెలంగాణకు హైదరాబాద్ ఎలాగో.. అలా వైజాగ్ కూడా ఏపీకి కీలకం కానుంది. కాబట్టి ఎలా చూసినా గానీ వైజాగ్ లో స్థలాల మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల అధిక లాభాలు ఉంటాయి. స్థలం పరంగా, డబ్బు పరంగా సంతృప్తి ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ స్థలం సొంతం చేసుకోవచ్చు.