ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. జీతాలను దాదాపు రెట్టింపు చేస్తామని వెల్లడించింది. ఈ విషయాన్ని సంస్థ సీఈఓ సత్యనాదెళ్ల సిబ్బందికి ఈ మెయిల్ ద్వారా వెల్లడించారు. రాజీనామాల సంస్కృతికి చెక్ పెట్టడంతో పాటు, నిపుణులైన వారిని కాపాడుకునేందుకు మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
‘వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో మీరు అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారు. అందుకే మన సంస్థకు మంచి ఆదరణ ఉంది. అందుకు మీకు పెద్ద థ్యాంక్స్. మీ ప్రతి ఒక్కరిపై మేము దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెడుతున్నాం. ఆ నిమిత్తం గ్లోబల్ మెరిట్ బడ్జెట్ను రెండింతలు చేశామని, తమ కెరీర్ మధ్యలో ఉన్న వారికి వేతన పెంపు భారీగా ఉంటుందని ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో ఆయన పేర్కొన్నారు. నైపుణ్యం కలిగిన ఉద్యోగులను కాపాడుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచుతున్న నేపధ్యంలో మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. జనవరిలో గూగుల్ తన నలుగురు టాప్ ఎగ్జిక్యూటివ్స్ జీతాలను భారీగా పెంచింది. వారి మూల వేతనం 6,50,000 డాలర్ల నుంచి ఒక మిలియన్ డాలర్లకు పెరిగింది. ఇక.. ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సైతం ఫిబ్రవరిలో కార్పొరేట్, టెకీలకు వేతనాలను రెట్టింపు చేసింది.
“Microsoft plans to nearly double its global budget for merit-based salary increases,”
Satya Nadella details Microsoft plan for ‘significant additional investment’ in employee compensation – GeekWire https://t.co/rK3j9aFvSc
— Ian Robinson (@IanRobinson) May 17, 2022
ఇది కూడా చదవండి: నా బర్త్ డే.. నా ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటా! అడగడానికి మీరు ఎవరు? : ఐరా ఖాన్
ఈ మధ్యకాలంలో గ్రేట్ రెజిగ్నేషన్ ఎక్కువగా వినిపిస్తోంది. ఉద్యోగులు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ, అధిక వేతనం వచ్చే వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ పరిస్థితి అగ్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. మరోపక్క కార్యాలయాలకు రావడం కంటే ఇంటి నుంచి పనికే ఉద్యోగులు మొగ్గు చూపుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. కార్యాలయాలకు రమ్మంటే ఉద్యోగాలను వీడటానికి సిబ్బంది వెనకాడటం లేదు. వీటికి ద్రవ్యోల్బణ పరిస్థితులు తోడయ్యాయి. ఇవన్నీ కలిసి ఈ భారీ స్థాయి పెంపునకు దోహదం చేస్తున్నట్లు తెలుస్తోంది.