కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? ఐతే వెంటనే కొనేయండి.. లేదంటే భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. ఎందుకు..? ఏంటి..? అనుకుంటున్నారా! ధరలు పెరగనున్నాయి.
దేశంలో మాంసాహార ప్రియులకు తక్కువ ధరలో వచ్చే టేస్టీ ఫుడ్ ఏదంటే వెంటనే గుర్తుకు వచ్చేది కోడిగుడ్డు. మార్కెట్ లో మటన్ ధర పెరిగిపోవడంతో చాలా మంది చికెన్ కొనడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల చికెన్ ధర కూడా పెరిగిపోవడంతో సామాన్యుడు కొడిగుడ్డు వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఇక్కడ కూడా సామాన్యులకు చుక్కెదురవుతుంది.. కొడి గుడ్డు ధర రోజు రోజుకీ పెరిగిపోతుంది. మొన్నటి వరకు డజను రూ.65 నుంచి రూ. 70 వరకు ఉండగా పది […]
ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించే వార్త ఇది. వచ్చే నెల నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. నాలుగు శాతం డియర్నెస్ అలవెన్స్(డీఏ) పెంపుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం అధికంగా ఉండడంతో డీఏ పెంపుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం.. 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం డీఏను 3 శాతం పెంచడానికి ఆమోదించింది. […]
ఇప్పటికే అధిక ధరలో అల్లాడుతున్న సామాన్యులపై జీఎస్టీ రూపంలో మరో భారం పడనుంది. ఒక వైపు రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతుంటే.. మరో వైపు ప్రభుత్వం కనిపించినదానిపైనల్లా పన్నులు వేసుకుంటూ పోతోంది. అటు ఆర్బీఐ, ఇటు ప్రభుత్వం రెండూ సామాన్యులపైనే గురిపెట్టి మరి బాదుతున్నాయి. గత నెలలో జరిగిన జీఎస్టీ 47వ సమావేశంలో పలు రకాల నిత్యావసర ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లను పెంచిన సంహతి తెలిసిందే. పెంచిన జీఎస్టీ రేట్లు ఈ […]
కొత్త బైక్ కొనాలనే ఆలోచనలో ఉన్నవారికి ఈ వార్త బ్యాడ్ న్యూస్ గా చెప్పొచ్చు. దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ.. బజాజ్ టూవీలర్ల ధరలు పెంచింది. బజాజ్ నిర్ణయంతో కొత్తగా బైక్ కొనాలని భావించే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఎక్కువ డబ్బులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే.. నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త బైక్ కొనాలనే ఆలోచనలో ఉన్న మధ్యతరగతి ప్రజలకు ఇది మరింత భారంగా మారనుంది. బైక్ […]
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై వడ్డీ రేట్లు పెంచే దిశగా ఆలోచిస్తున్నట్లు సంకేతాలిచ్చింది. తాజాగా జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక రివ్యూలో రెపో రేటును 50 బేసిస్ పాయింట్లకు పెంచిన నేపథ్యంలో.. స్టేట్ బ్యాంక్ ఈ నిర్ణయాన్ని వెలువరించింది. ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 4.90 శాతంగా నిర్ణయించింది. ఫలితంగా పలు రుణాలపై ఈఎంఐ […]
ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. జీతాలను దాదాపు రెట్టింపు చేస్తామని వెల్లడించింది. ఈ విషయాన్ని సంస్థ సీఈఓ సత్యనాదెళ్ల సిబ్బందికి ఈ మెయిల్ ద్వారా వెల్లడించారు. రాజీనామాల సంస్కృతికి చెక్ పెట్టడంతో పాటు, నిపుణులైన వారిని కాపాడుకునేందుకు మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో మీరు అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారు. అందుకే మన సంస్థకు మంచి ఆదరణ ఉంది. అందుకు మీకు పెద్ద […]
అందరూ ఊహించిందే జరిగింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేంద్రం పెట్రో మంట పెడుతుందని భావించారు. దానికి తగ్గట్లే.. గడిచిన ఐదు రోజుల్లో ఏకంగా నాలుగుసార్లు పెట్లో రేట్లు పెంచారు. తాజాగా శనివారం దేశ వ్యాప్తంగా లీటర్ పెట్రోల్ పై 89పైసలు, డీజిల్పై 86పైసలు పెరిగాయి. ఇది కూడా చదవండి: దేశంలో పెట్రో ధరల మంట! బంకుల మూసివేత దిశగా కంపెనీలు..! మరోవైపు అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ఎప్పటికప్పుడు ధరలను పెంచనందుకు ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన […]
మార్చి 18 వ తేదీ అనగా శుక్రవారం.. హోలీ పండుగ చాలా మందికి ఆఫీసులకు సెలవు. హాలీడే లేని వాళ్లు.. యధావిధిగా రోజు మాదిరి రెడీ అయ్యి.. బస్ స్టాప్కి వచ్చి బస్సు ఎక్కారు. రోజు వెళ్లేదే కాబట్టి.. టికెట్కు సరిపడా.. డబ్బులు చేతిలో పట్టుకుని నిల్చున్నారు. కండక్టర్ వచ్చాడు.. ఫలనా స్టాప్ అని చెప్పి.. డబ్బులు చేతిలో పెట్టారు. కండక్టర్ వారి వైపు ఎగాదిగా చూసి.. ఇంకో ఐదు రూపాలయు ఇవ్వాలన్నాడు. అదేంటి నిన్నటి వరకు […]
దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వరుసగా చమురు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. దీనితోనే సతమతమవుతుంటే.. ఇప్పుడు ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు నవంబర్ 1 నుంచి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను భారీగా పెంచింది. గ్యాస్ కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను అమాంతం పెంచుతూ దీపావళి షాక్ ఇచ్చారు. ఇక 19 కేజీల గ్యాస్ బండ ధరను రూ.266 […]