మార్చి 18 వ తేదీ అనగా శుక్రవారం.. హోలీ పండుగ చాలా మందికి ఆఫీసులకు సెలవు. హాలీడే లేని వాళ్లు.. యధావిధిగా రోజు మాదిరి రెడీ అయ్యి.. బస్ స్టాప్కి వచ్చి బస్సు ఎక్కారు. రోజు వెళ్లేదే కాబట్టి.. టికెట్కు సరిపడా.. డబ్బులు చేతిలో పట్టుకుని నిల్చున్నారు. కండక్టర్ వచ్చాడు.. ఫలనా స్టాప్ అని చెప్పి.. డబ్బులు చేతిలో పెట్టారు. కండక్టర్ వారి వైపు ఎగాదిగా చూసి.. ఇంకో ఐదు రూపాలయు ఇవ్వాలన్నాడు. అదేంటి నిన్నటి వరకు ఫలనా మొత్తమే కదా.. మరి ఐదు రూపాయలు ఎందుకు అంటే.. రాత్రే టికెట్ రేట్లు పెంచారని చెప్పి.. కండక్టర్ ప్రయాణికులకు చిన్న సైజ్ షాకే ఇచ్చాడు. ఈ ధరల పెంపుపై చాలామంది ప్రయాణికులు కండక్టర్లతో గొడవ పెట్టుకున్నారు. కానీ వాళ్ల చేతుల్లో ఏం ఉంది. సంస్థ నిర్ణయం తీసుకుంది.. వాళ్లు టికెట్ కొట్టారు. ఈ క్రమంలో చాలా మంది పెరిగిన టికెట్ రేట్ల విషయమై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం టీఎస్ఆర్టీసీ అధికారులు టికెట్ రేట్లు పెంచినట్లు ప్రకటన ఇచ్చారు.
ఇది కూడా చదవండి: వామ్మో.. సజ్జనార్ క్రియేటివిటీకి నెటిజన్ల ఫిదా.. వీడియో వైరల్!
లగ్జరీ, ఎక్స్ప్రెస్ బస్సులపై రూ.1 పెంచారు. టోల్ప్లాజా ధర టికెట్పై రూపాయి పెంచారు. సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులపై రూ.2 మేర పెంచింది టీఆస్ఆర్టీసీ. పల్లె వెలుగు టికెట్ల ఛార్జీలను ఆర్టీసీ రౌండప్ చేసింది. చిల్లర సమస్య లేకుండా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఆస్ ఆర్టీసీ పేర్కొంది.
ఇది కూడా చదవండి: ఆర్టీసీ బస్సులో పెళ్లి మండపానికి యువ IAS..!
పల్లె వెలుగు ఛార్జీలు రౌండప్..రాష్ట్రంలో పల్లె వెలుగు బస్సుల్లో చిల్లర సమస్య లేకుండా చూసేందుకుగానూ ఛార్జీలను టీఎస్ఆర్టీసీ సవరించింది. రూ.13 ఉన్న టికెట్ ధరను రూ.15 చేసింది. పూర్తి వివరాలను ఆర్టీసీ ఉత్తర్వుల్లో పేర్కొనాల్సి ఉంది. పెరుగుతున్న డీజిల్ ధరల నేపథ్యంలో కొన్ని నెలల కిందట టీఎస్ఆర్టీసీ బస్సు ఛార్జీలను అమాంతం పెంచేసింది. తాజాగా టోల్ ప్లాజా రూ.1, లగ్జరీ, ఎక్స్ప్రెస్ బస్సులపై రూ.1 పెంచారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. టీఎస్ఆర్టీసీ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: అర్ధరాత్రి సజ్జనార్కు యువతి రిక్వెస్ట్! వెంటనే స్పందించి..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.