కొత్త బైక్ కొనాలనే ఆలోచనలో ఉన్నవారికి ఈ వార్త బ్యాడ్ న్యూస్ గా చెప్పొచ్చు. దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ.. బజాజ్ టూవీలర్ల ధరలు పెంచింది. బజాజ్ నిర్ణయంతో కొత్తగా బైక్ కొనాలని భావించే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఎక్కువ డబ్బులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే.. నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త బైక్ కొనాలనే ఆలోచనలో ఉన్న మధ్యతరగతి ప్రజలకు ఇది మరింత భారంగా మారనుంది.
బైక్ పెంపు ధరలను చూస్తే.. అత్యధికంగా డామినార్ 250 ధర రూ.6,400 పెరిగి రూ.1.75 లక్షలు కాగా, డామినార్ 400 ధర రూ.1,152 పెరిగి రూ.2.23 లక్షలకు చేరింది. ఇక.. పల్సర్ N250 ధర రూ.1,299 పెరగగా, పల్సర్ NS200, RS200 ధరలు వరుసగా రూ.999, రూ.1,088 పెరిగాయి. అలాగే.. పల్సర్ 125, 150, NS125, NS160 ధరలు వరుసగా.. రూ.1,101, రూ.717, రూ.1,165, రూ.896 పెరిగాయి.
అవెంజర్ 220, అవెంజర్ 160 ధరలు కూడా రూ.1000 లోపు పెంచింది. ప్లాటినా 100 డ్రమ్ కమమ్యూటర్ ధర రూ.1,978 పెరిగి రూ. 63,130కు చేరగా, ప్లాటినా 110, CT100X ధర కూడా పెంచింది. ఇదిలా ఉండగా పల్సర్250 బ్లాక్ వేరియంట్లు, పల్సర్ ఎన్160 యొక్క రేట్లు ఎప్పటి లానే ఉన్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: LIC: రూ. 253 పొదుపుతో రూ.54 లక్షలు మీ సొంతం.. ఒక్క పాలసీతో ఎన్నో లాభాలు!
ఇది కూడా చదవండి: Jio: జియో కస్టమర్లకు సూపర్ ఛాన్స్.. రూ.20కే 28GB ఎక్స్ట్రా డేటా..!