ఇప్పటికే అధిక ధరలో అల్లాడుతున్న సామాన్యులపై జీఎస్టీ రూపంలో మరో భారం పడనుంది. ఒక వైపు రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతుంటే.. మరో వైపు ప్రభుత్వం కనిపించినదానిపైనల్లా పన్నులు వేసుకుంటూ పోతోంది. అటు ఆర్బీఐ, ఇటు ప్రభుత్వం రెండూ సామాన్యులపైనే గురిపెట్టి మరి బాదుతున్నాయి. గత నెలలో జరిగిన జీఎస్టీ 47వ సమావేశంలో పలు రకాల నిత్యావసర ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లను పెంచిన సంహతి తెలిసిందే. పెంచిన జీఎస్టీ రేట్లు ఈ నెల 18 నుండే అమల్లోకి రానున్నాయి.
జీఎస్టీ పెంపు వల్ల రోజువారి వినియోగించే అనేక నిత్యావసరాలపై సామాన్యులు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. గతంలో బ్రాండెడ్ ప్యాకేజీ ఐటమ్స్పై మాత్రమే జీఎస్టీ వసూలు చేసేవారు. ఇక నుంచి ప్యాక్ చేసిన అన్నింటిపైనా జీఎస్టీ వసూలు చేయనున్నారు. దీంతో ఇప్పుడు పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, లస్సీ, ఇలా అనేకం మార్కెట్లో ప్యాకేట్లలో ఉండే వాటిపై 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు. వీటితో పాటు ప్యాకే చేసిన బియ్యం, గోధుమ పిండి, కారం, పసుపు ఇలా ఈ జాబితా చాలా పెద్దదిగానే ఉంది.
జీఎస్టీ 12 శాతానికి పెరిగినవి
18 శాతానికి పెరిగినవి
ఇతరత్రా
కొన్నింటిపై తగ్గింపు
రోప్ వే ద్వారా చేరవేసే ప్రయాణీకులు, వస్తువులపై గతంలో ఉన్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. ఇంధనంతో కలిసి కిరాయికి తీసుకునే గూడ్స్ కారియర్స్పై 18 నుంచి 12 శాతానికి జీఎస్టీ తగ్గించారు. కొన్ని ఆర్ధోపెడిక్ ఉపకరణాలపై పన్ను రేటును 12 నుంచి 5 శాతానికి తగ్గించారు.
క్యాసినో, ఆన్లైన్ గేమ్స్పై
క్యాసినో, ఆన్లైన్ గేమ్స్పై ఎంత జీఎస్టీ విధించాలన్న దానిపై గత సమావేశంలో నిర్ణయం తీసుకోలేదు. గుర్రం పందెలపై కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వీటిపై 28 శాతం జీఎస్టీ విధించాలని మంత్రుల గ్రూప్ సూచించింది.
సామాన్యుడి బడ్జెట్ తలక్రిందులు
నిత్యం వాడే వాటిపై భారీగా పన్ను పెంచడం వల్ల సామాన్యుల వంటింటి బడ్జెట్ తారుమారవుతుంది. వారి నెలవారి బడ్జెట్ తలక్రిందులవుతుందని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ద్రవ్యోల్బణం పెరిగి మిడిల్, అప్పర్ మిడిల్ క్లాస్ కుటుంబాల బడ్జెట్ తారుమారైంది. అన్నింటికీ గతం కం టే అధికంగానే చెల్లిస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్లు రెండు సార్లు పెంచింది. ఇంకా అది అదుపులోకి రాలేదు. దీంతో మరోసారి వడ్డీ రేట్లు పెంపుదల ఉంటుందని ఆర్బీఐనే స్వయంగా ప్రకటించింది. దీని వల్ల బ్యాంక్ల్లో రుణాలతో సొంతింటిని సమకూర్చుకున్న సామాన్యులకు ఈఎంఐలు భారంగా మారాయి.
చాలా మంది ఉద్యోగులు ఇల్లు, కారు, లేదా ద్విచక్ర వాహనాలు, టీవీ, ప్రీజ్డ్.. ఇలా పలు గృహోపకరణాలు సైతం ఈఎంఐ పద్దతిలోనే కొనుగోలు చేస్తున్నారు. క్రెడిట్, డెబిట్ కార్డులపై కూడా రుణాలు ఇస్తుండటంతో చాలా మంది ఈఎంఐల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు అన్ని బ్యాంక్లు వడ్డీ రేట్లు పెంచాయి. ఇలా ఇప్పటికే సామాన్య, మధ్యతరగతి ప్రజలు అధికంగా చెల్లిస్తున్నారు. సోమవారం నుంచి ఇలా అన్ని రకాల నిత్యావసరాలపై జీఎస్టీ రూపంలో సామాన్యులపై మరింత భారం మోపుతున్నది. ఆర్బీఐ రెండు సార్లు వడ్డీ రేట్లు పెంచినప్పటికీ, ఇంకా ద్రవ్యోల్బణం 7 శాతానికి పైగానే నమోదవుతున్నది. ధరల పెంపుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#GST pic.twitter.com/NrOu1L9BMG
— Sekhar Rambo (@RamboSekhar) July 17, 2022