పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్.. తెలుగు ఓటీటీ సీజన్ ప్రారంభానికి సమయం ఆసన్నమవుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి బిగ్ బాస్ హౌజ్ లో పాల్గొనబోయేవారి విషయంలో చర్చలు నడుస్తున్నాయి. ఓటిటిలో ప్రసారం కాబోతున్న ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు వీరేనంటూ కొన్ని పేర్లు వెలుగులోకి వచ్చాయి. అయితే.. ఈసారి బిగ్బాస్ ఓటీటీలో పాల్గొనేందుకు యాంకర్ వింధ్యా మేడపాటి రెడీ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి.
తెలుగు టీవీ ప్రేక్షకులకు వింధ్యా మేడపాటి సుపరిచితమే. ముఖ్యంగా స్పోర్ట్స్ యాంకర్ గా, క్రికెట్ కామెంటేటర్ గా వింధ్యా యువతకు బాగా దగ్గరైంది. గత IPL సీజన్లలో కామెంటరీ మాత్రమే కాకుండా వినోదభరిత టీవీ షోలతో కూడా మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఇటీవలే యాంకర్ రవితో కలిసి ‘నువ్వు రెడీ నేను రెడీ’ అనే షోలో యాంకరింగ్ చేసింది. ఆ షో నిలిచిపోవడంతో టీవీ ప్రేక్షకులకు కొంతకాలం దూరమైంది.ఇక త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్ కోసం వింధ్యా రెడీ అవుతుండగా.. తాజాగా ఆమె బిగ్ బాస్ ఓటీటీ ఫార్మాట్ లో అడుగు పెట్టనుందని ప్రచారం మొదలైంది. మొదటిసారి ఓటీటీలో ప్రసారం కానున్న కాబోతున్న బిగ్ బాస్ ఓటీటీ ఎంట్రీ పై వింధ్యా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం లేకపోలేదని.. వింధ్యా తన అభిప్రాయాన్ని తెలిపినట్లు సమాచారం. మరి యాంకరమ్మ బిగ్ బాస్ ఎంట్రీ ఖాయమేనని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి యాంకర్ వింధ్యా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.