సెలబ్రిటీలు అనగా సినీ, రాజకీయ ప్రముఖులు చాలా అరుదుగా మాత్రమే సామాన్యులతో మమేకమవుతారు. జనాలతో కలిసి పోవాలని వారికి ఉన్నా.. కొన్ని కారణాల దృష్ట్యా అది సాధ్యం కాదు. అయితే అప్పుడప్పుడు కొందరు సెలబ్రిటీలు తమ రోజువారి జీవితాల నుంచి బయటకు వచ్చి.. ప్రజలతో మమేకమై.. వారిలో కలిసిపోయి.. సామాన్యుల మాదిరి జీవిస్తారు. తాజాగా ఈ జాబితాలోకి తిరుపతి జిల్లా పరిధిలోని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చేరారు. ఎమ్మెల్యే అయి ఉండి కూడా రోడ్డు పక్కన హోటల్లో టిఫిన్ చేసి.. అందరిని ఆశ్చర్యపరిచారు. అది కూడా 78 ఏళ్ల వృద్ధురాలు నడిపిస్తోన్న హోటల్లో. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరలవుతున్నాయి. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: జగన్ మంత్రి పదవి ఇస్తానన్నా.. వద్దన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి! కారణం?
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తన నియోజకవర్గంలో పల్లెబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం ఆయన ఎర్రావారిపాళెం మండలంలోని ఓ పాకలో నిర్వహిస్తున్న టిఫిన్ సెంటర్కు వెళ్లారు. అక్కడ 78 ఏళ్ల సిద్ధమ్మ అవ్వ వద్ద రెండు దోసెలు..కాస్త చెట్నీ తీసుకున్నారు. అవ్వపెట్టిన దోసెలు ఆరగిస్తూ .. చాలా రుచిగా ఉన్నాయని ప్రశంసించారు. ఆ తర్వాత అవ్వ వివరాలు తెలుసుకున్నారు చెవిరెడ్డి. ఈ సందర్భంగా సదరు వృద్ధురాలు మాట్లాడుతూ.. తన పేరు సిద్ధవ్వ అని.. 40 ఏళ్ల నుంచి టిఫిన్ సెంటర్ నడుపుతున్నట్లు తెలిపింది. పిల్లలు స్థిరపడ్డారని చెప్పింది. మనవరాలు ఎయిర్హోస్టెస్గా పనిచేస్తున్నట్టు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: MLA చెవిరెడ్డి అసెంబ్లీలో చెప్పులు వేసుకోరు! కారణం చెప్పిన అంబటి రాంబాబు!
స్థానికులు అక్కడకు చేరుకుని ఎమ్మెల్యేని చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడ ఉన్నది ఎవరో తెలుసా అవ్వా? అంటూ వృద్ధురాలిని అడిగారు. తనకు చూపు తక్కువని.. ఇంతసేపు తనతో మాట్లాడింది ఎవరో గుర్తుపట్టలేదని వారికి చెప్పింది. వారు ఇక్కడుండేది చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అని చెప్పడంతో అవ్వ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. చెవిరెడ్డి సింప్లిసిటీపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: తాడేపల్లిలో సీఎం ఇంటి సమీపంలో అందరినీ ఆకట్టుకుంటున్న గోశాల