ఏపీలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయా పార్టీల అధినేతలను సంప్రదిస్తున్నారు ఆశావాహులు.
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష నేతలు వచ్చే ఎన్నికల్లో గెలుపు సొంతం చేసుకోవడం కోసం అన్నిరకాల ప్రయత్నాలు మొదలు పెట్టారు. వివిధ అభివృద్ది పథకాలతో అధికార పార్టీ ప్రజల్లోకి వెళ్తుంటే.. అధికారంలోకి వచ్చి ఇంతకాలం అయినా.. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని.. అధికార పార్టీ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని విమర్శిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రతిపక్ష నేతలు. మరోవైపు అభ్యర్థుల ఎంపిక చేసే ప్రక్రియ మొదలు పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆశావాహుల, కొత్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేవారు ఆయా పార్టీల అధినేతలను సంప్రదిస్తున్నారు. తాజాగా రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి సోదరుడు మేడా విజయ శేఖర్ రెడ్డి టీడీపీ లో రంగం సిద్ధమైంది. వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం ఏపీ రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలు పెట్టినట్లు సమాచారం. తాజాగా అన్నమయ్య జిల్లా రాజంపేట లో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి సోదరుడు మేడా విజయ శేఖర్ రెడ్డి టీడీపీలోకి చేరుతున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. త్వరలో భారీగా కార్యకర్తలతో తరలి వెళ్లి టీడీపీ కండువ కప్పుకునేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు తెలిపారు. టీడీపీలో తన చేరిక విషయంలో ఎవరి ప్రోత్సాహం లేదని అన్నారు. టీడీపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తానని.. లేకుంటే పార్టీ కార్యకర్తగా రాజంపేట జిల్లా కేంద్రం కోసం, అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు.
ఒకవేళ తాను ఇచ్చిన హామీలను నెరవేర్చక పోతే రాజకీయాల నుంచి తప్పు కుంటానని తెలిపారు. ప్రజల సంక్షేమాభివృద్ది జరగాలంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి తప్పకుండా రావాలని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే..ప్రభుత్వ భూకబ్జా లను వెలికి తీస్తానని పేదలకు పంచుతానని తెలిపారు. గత కొంత కాలంగా వైసీపీ నేతల నాపై చేసిన ఆరోపణలు నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. ఏపీలో యువ నేత లోకేష్ యువగళం ప్రభంజనంలా సాగుతోందని అన్నారు. వెళ్లిన ప్రతిచోట ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. తాను మొదట నుంచి టీడీపీ వాడినని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు వెంట నడుస్తానని తెలిపారు.