తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. మే 19వ తేదీ అర్థరాత్రి 2 గంటల సమయంలో అకౌంట్ ని హాక్ చేసిన హ్యాకర్లు.. అకౌంట్ నుంచి వందలాది స్పామ్ ట్వీట్లు పోస్టు చేశారు. స్పేస్ ఎక్స్ ట్వీట్కు కామెంట్ల రూపంలో ఇవన్నీ చేసినట్లు కనిపిస్తోంది. మొదటగా.. ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ ట్విటర్ ఖాతా స్టార్షిప్కు సంబంధించిన నాలుగు ఫొటోలను పోస్టు చేసిన హ్యాకర్లు.. ఆ ట్వీట్కు రిప్లై ఇస్తూ టీడీపీ అధికారిక ట్విటర్ ఖాతా నుంచి ‘గ్రేట్ జాబ్’, ‘లవ్ దిస్’, ‘ఆసమ్’ అంటూ కొన్ని వందల కామెంట్లు చేశారు. ప్రతి కామెంట్లోనూ.. రెండు ఇంగ్లీష్ పదాలతో పాటు నాలుగు ఇంగ్లీష్ అక్షరాలు ర్యాండమ్గా పోస్టు చేశారు.
దీనిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. తమ పార్టీ ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని, దీనిని తిరిగి పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు లోకేశ్ ట్వీట్ చేస్తూ.. ‘‘కొన్ని దుర్మార్గపు శక్తులు జైటీడీపీ (తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విటర్ హ్యాండిల్ పేరు)ని హ్యాక్ చేశాయి. దయచేసి గమనించండి’’ అని పేర్కొన్నారు.
Kindly note that our official party account @jaitdp has been hacked by nefarious elements. We are working with @TwitterIndia to restore the account.
— Lokesh Nara (@naralokesh) March 19, 2022