Sompalli: పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో గురువారం పెను ప్రమాదం తప్పింది. వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన సమయంలో బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ నేతలు నీటిలో పడిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని సోంపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్రబాబు పర్యటనలో భాగంగా టీడీపీ నేతలు ప్రయాణించిన పడవ ఒక పంటును ఢీ కొనడంతో ప్రమాదం ఏర్పడింది.
బోటు దిగే సమయంలో బోటు ఒక్కసారిగే ఒకే వైపుకు ఒరిగిపోవడంతో.. బోటులో ఉన్న దేవినేని ఉమా, రాధాకృష్ణ, రామరాజు సత్యనారాయణ, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు వరదనీటిలో పడిపోయారు. ఈ ప్రమాదాన్ని గ్రహించిన స్థానికులు వెంటనే లైఫ్ జాకెట్లను విసిరేశారు. అంతేగాక మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల గన్ మెన్లు కూడా నీటిలో పడిన ప్రజా ప్రతినిధులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు సమాచారం. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.