2017లో హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో ధాత్రి మిల్క్ బ్యాంకును ప్రారంభించారు. ఒకటిన్నర కేజీలోపు బరువుతో పుట్టిన పిల్లలకు, తల్లి మరెక్కడో ఉండి ఇక్కడి ఎన్ఐసీయూలో చేర్చిన పిల్లలకు, అనాథ పిల్లలకు ఇక్కడ నుంచి డాక్టర్ సూచన మేరకు సేకరించిన తల్లిపాలను అందిస్తారు. వీరి సేవలన్నీ ఉచితం. ఇలాంటి తల్లిపాల బ్యాంకులు దేశంలో కేవలం 18 ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారి నుంచి పాలు సేకరించి అవసరంలో ఉన్న వారికీ ధాత్రి మిల్క్ బ్యాంకు ఇస్తుంది. ఆరు నెలల్లోపు పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం వల్ల త్వరగా జీర్ణమవుతాయి. చిన్నారుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. రోగనిరోధక శక్తి, జ్ఞాపకశక్తి పెరిగే అవకాశాలు ఎక్కువ. బిడ్డకు రోజుకు కనీసం 8 నుంచి 10 సార్లు పాలు తాగించాల్సి ఉంది. ఇలా కనీసం ఆరు మాసాల పాటు తల్లి పాలే అందించాలి.
ధాత్రి ఫౌండేషన్, ప్రభుత్వం సంయుక్తంగా రూ.కోటితో నిలోఫర్ నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రంలో మదర్స్ మిల్క్ బ్యాంక్ను నెలకొల్పింది. ఈ ఆస్పత్రిలో నిత్యం వెయ్యి మందికిపైగా శిశువులు చికిత్స పొందుతుండగా, వీరిలో సగానికిపైగా నెలలు నిండకముందు, తక్కువ బరువుతో జన్మించిన వారే ఉంటున్నారు. వీరిలో చాలా మంది రోజుల తరబడి తల్లికి దూరంగా చికిత్స పొందుతుంటారు. తల్లికి దూరంగా ఉన్న వైద్యులు సిఫార్సు చేసిన 1.5 కేజీల లోపు శిశువులకు మదర్స్ మిల్క్ బ్యాంకు ముర్రు పాలు సరఫరా చేస్తుంది. ఇలా నెలకు సగటున 400 మంది పిల్లల ఆకలి తీర్చతుండటం విశేషం.
రోజుకు 15 నుంచి 20 మంది వరకు ఈ కేంద్రానికి వస్తుండటం విశేషం. ఇక్కడ రోజుకు 450 మంది పిల్లలకు సరిపడా పాలను నిల్వ చేసే సౌలభ్యం ఉంది. తల్లులు ఇచ్చిన పాలన్నీ కలిపి 150 మిల్లీలీటర్ల డబ్బాల్లోకి సమానంగా మారుస్తారు.’పాశ్చరైజేషన్’తో ఈ పాలను శుద్ధి చేస్తారు. శుద్ధిచేసిన పాలను మరోసారి పరీక్షకు పంపి అన్ని వివరాలు తెలుసుకొని, అవసరమున్న పిల్లలకు డాక్టర్ సలహా మేరకు అందిస్తారు.
బ్రెజిల్ లాంటి దేశంలో 260, అమెరికాలో 150 పాల బ్యాంకులు ఉంటే, భారత్లో కేవలం 14 పాల బ్యాంకులే ఉన్నాయి. 100 గ్రాముల తల్లిపాలలో 65 కిలో కేలరీల శక్తినిస్తాయి. ఇందులో విటమిన్ ఎ సహా థయామిన్, రైబోఫ్లెవిన్, బి12, బి6, సెనథోనిక్ ఆమ్లం, బయో టిక్, ఫోలిక్ ఆమ్లం, సీ,డీ,ఇ విటమిన్లు, క్యాల్షియం, ఇనుము, మెగ్నీషియం, వంటి ఖనిజ లవ ణాలు లభిస్తాయి.