2017లో హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో ధాత్రి మిల్క్ బ్యాంకును ప్రారంభించారు. ఒకటిన్నర కేజీలోపు బరువుతో పుట్టిన పిల్లలకు, తల్లి మరెక్కడో ఉండి ఇక్కడి ఎన్ఐసీయూలో చేర్చిన పిల్లలకు, అనాథ పిల్లలకు ఇక్కడ నుంచి డాక్టర్ సూచన మేరకు సేకరించిన తల్లిపాలను అందిస్తారు. వీరి సేవలన్నీ ఉచితం. ఇలాంటి తల్లిపాల బ్యాంకులు దేశంలో కేవలం 18 ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారి నుంచి పాలు సేకరించి అవసరంలో ఉన్న వారికీ ధాత్రి మిల్క్ బ్యాంకు ఇస్తుంది. ఆరు నెలల్లోపు పిల్లలకు […]