ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారంతో రాజకీయ పండుగ నడుస్తోంది. మరోవైపు అసమ్మతి సెగలు కూడా బాగానే తగులుతున్నాయి. తమ నాయకుడికి మంత్రి పదవి దక్కలేదని స్థానికంగా కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు నిరసనలు తెలుపుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అయితే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ పిలిచి మంత్రి పదవి ఇస్తానన్నా కూడా వద్దని చెప్పినట్లు సమాచారం. తమ స్థానంలో వేరొకరికి అవకాశం కల్పిస్తే పార్టీ కోసం పనిచేస్తారని చెప్పినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: మంత్రి పదవి ఎఫెక్ట్.. MLA రోజా షాకింగ్ నిర్ణయం!
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటు అనే చెప్పాలి. వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై పీహఎచ్ డీ కూడా చేశారు. మొదటి నుంచి వైఎస్ కుటుంబం అన్నా.. సీఎం జగన్ కి.. చెవిరెడ్డి ఎంతో నమ్మకంగా ఉండేవారు. మొదటి దఫాలోనే కేబినెట్ లో అవకాశం కల్పిద్దామని జగన్ భావించినా.. పెద్దిరెడ్డి వల్ల అది కుదరలేదు. రెండో దఫాలో కూడా పెద్దిరెడ్డికి అవకాశం ఇస్తున్నా కూడా చెవిరెడ్డికి కూడా మంత్రి పదవి ఇచ్చేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కానీ, అందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిరాకరించారు. తనకి మంత్రి పదవి వద్దని.. తుడా ఛైర్మన్ పదవినే కొనసాగించండని కోరుకున్నారు. ఆ విజ్ఞప్తిని పరిశీలించిన సీఎం జగన్ తుడా ఛైర్మన్ పదవిని మరో రెండేళ్లు కొనసాగించారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా విడుదల చేశారు.అయితే మంత్రి పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు తాను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానని.. వేరొకరికి ఆ అవకాశం కల్పిస్తే పార్టీ కోసం నమ్మకంగా పనిచేస్తారనే ఉద్దేశంతో చెవిరెడ్డి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే అడిగి మరీ తుడా ఛైర్మన్ పదవినే కొనసాగేలా చూడాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరుకున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.