చిన్న సినిమాగా వచ్చి ప్రభంజనం సృష్టించిన సినిమా బేబి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్ర ధారులుగా తెరకెక్కిన చిత్రం బేబి. ఈ సినిమాను 7 కోట్లు తీయగా.. 70 కోట్లకు పైగా వసూలు చేసిందని సమాచారం.
చిన్న సినిమాగా వచ్చి ప్రభంజనం సృష్టించిన సినిమా బేబి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్ర ధారులుగా తెరకెక్కిన చిత్రం బేబి. ఈ సినిమాను రూ. 7 కోట్లు తీయగా.. రూ. 70 కోట్లకు పైగా వసూలు చేసిందని సమాచారం. కల్ట్ క్లాసిక్గా నిలిచిన ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి నటులు ప్రత్యేకంగా అభినంద సభలు పెట్టి.. నటీనటులు, టెక్నీషిన్లను పొగిడిన సంగతి విదితమే. సినిమా విడుదలై సుమారు 20 రోజులు దాటిపోతున్నా.. ఇంకా బ్రహ్మండమైన కలెక్షన్లతో దూసుకెళుతూ ఉంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్.. వరుసగా సక్సెస్ మీట్స్లో పాల్గొంటోంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ బృందం సందడి చేసింది.
ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు మీడియా అక్కడకు వెళ్లింది. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులకు, బేబి సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ఎస్కెఎన్కు మధ్య వాగ్వాదం నెలకొంది. ఏమైందో తెలియదు కానీ జర్నలిస్టులతో నిర్మాత తీవ్రంగా గొడపడ్డారు. మీడియా ప్రతినిధులపై నిర్మాత దౌర్జన్యం చేశారని, అలాగే బౌన్సర్లతో దాడి చేయడంతో ఓ జర్నలిస్టుకు గాయాలయ్యాయయని వార్తలు వస్తున్నాయి. అయితే అదే సమయంలో జర్నలిస్టులు కూడా ఎస్కెఎన్ పట్ల దురుసుగా ప్రవర్తించారని తెలుస్తోంది. అతడిపై దాడి జరగడంతోనే బౌన్సర్లు ప్రతిఘటించారని సమాచారం. అయితే రంగంలోకి దిగిన పోలీసులు.. పరిస్థితిని చక్కబెట్టారని తెలుస్తోంది.