భారత్లో కరోనా తీవ్ర వ్యాప్తి నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం భారత సరిహద్దులో ఉన్న 22 ప్రవేశ మార్గాలను మూసివేసేందుకు నిర్ణయం తీసుకుంది. భారత్తో ఉన్న 35 బోర్డర్ పాయింట్లలో 22 మార్గాలను మూసేయాలని ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు చేయడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కేవలం 13 మార్గాలు మాత్రమే ప్రజల రాకపోకలకు వీలుగా తెరచి ఉన్నాయి.
భారత్లో కరోనా విజృంభణ దృష్ట్యా.. ఐర్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా హోటళ్లలో క్వారంటైన్లో ఉండాలని ఆదేశించింది. భారత్తో పాటు జార్జియా, ఇరాన్, మంగోలియా, కోస్టారికా దేశాలకూ ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది.
నేపాల్-భారత్ మధ్య మొత్తం 35 సరిహద్దు పాయింట్లు ఉండగా అందులో 22 పాయింట్లను మూసేయాలని నేపాల్ కొవిడ్ క్రైసిస్ మేనేజ్మెంట్ కో ఆర్డినేషన్ కమిటీ మంత్రి మండలికి సిఫారసు చేసింది. భారత్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని నేపాల్ వెల్లడించింది.