ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇటీవల జరిగిన పరిణామాల నేపధ్యంలో.. నలుగురు ఎమ్మెల్యేలకు భద్రత పెంచారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులపై వ్యాఖ్యలు చేశారని తెదేపా నాయకులు ఆరోపించిన పలువురు ఎమ్మెల్యేకు భద్రత పెంచడం విశేషం. ఈ లిస్ట్ లో కొడాలి నాని, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు ఉన్నారు.వీరి నలుగురికి భద్రత పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు వీరికి ఉన్న వ్యక్తిగత సెక్యూరిటీ 1+1 ఉండగా దానిని 4+4 చేసింది.
అసెంబ్లీలో తనకి అవమానం జరిగిందని, ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ అంటూ చంద్రబాబు సభ నుండి బయటకి వెళ్ళిపోయిన విషయం తేలింసిందే. ఆ తరువాత జరిగిన ప్రెస్ మీట్ లో బాబు కన్నీరు పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలోనే టీడీపీ శ్రేణులు ఈ నలుగురు ఎమ్మెల్యేలకు పై బెదిరింపు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో వైసీపీ నాయకులు పోలీసులకి కంప్లైంట్స్ కూడా చేశారు. ఈ పరిణామాలను ఆధారంగా చేసుకుని నాయకులకు భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో మంత్రి కొడాలి నాని మాత్రం 2+2 గన్మెన్లతో పాటూ 1+4 గన్మెన్ల భద్రత పెంచారు.. 17మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు.. అలాగే కాన్వాయ్కు అదనంగా మరో వాహనాన్ని కేటాయించారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.