‘మిర్చి’లో ప్రభాస్ సరసన మెరిసిన అందాల భామ రిచా గంగోపాధ్యాయ తల్లి అయ్యారు. పండంటి మగబిడ్డకు ఆమె జన్మనిచ్చారు. మే 27న తనకు మగబిడ్డ పుట్టాడని సోషల్ మీడియా వేదికగా ఆమె వెల్లడించారు. చిన్నారికి ‘లుకా షాన్’ అనే పేరు పెట్టినట్టు రిచా తెలిపారు. ఆమె ఇన్స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. బాబుకి ‘లుకా షాన్’ అనే పేరు పెట్టినట్లు ఆమె తెలిపారు. ‘మా లుకా షాన్. మే 27న జన్మించాడు. చిన్నారి రాకతో మేమంతా ఎంతో ఆనందంగా ఉన్నాం. లుకా ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా, రూపురేఖల్లో అచ్చం తన నాన్నలాగానే ఉన్నాడు. లుకా.. నువ్వు మా జీవితాల్లో మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని నింపావు’ అని రిచా రాసుకొచ్చారు. బిడ్డ ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. రూపురేఖల్లో అచ్చం తన నాన్న మాదిరే ఉన్నాడని చెప్పారు.
అమెరికాలో పుట్టిపెరిగిన ‘లీడర్’ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రిచా మొదటి సినిమాతోనే ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. మిరపకాయ్, నాగవల్లి వంటి తెలుగు సినిమాలతో పాటు కోలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో నటించి కథానాయికగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. నాగార్జున భాయ్ చిత్రంలో చివరగా నటించిన రిచా ఆ తర్వాత అమెరికా తిరిగి వెళ్ళిపోయి, బిజినెస్ మేనేజ్ మెంట్ ప్రోగ్రామ్ చేసింది. అనంతరం ఉన్నత విద్య కోసం తిరిగి అమెరికాకు వెళ్లిపోయారు. అక్కడి బిజినెస్ స్కూల్లో సహాధ్యాయి జోను ప్రేమించారు. ఆ తర్వాత వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె మళ్లీ సినిమాల్లో నటించలేదు