ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల సైజులు మారిపోయాయి. పెద్ద పెద్ద ఫోన్లు వస్తున్నాయి. కానీ అలా గంటల తరబడి చిటికెన వేలు మీద భారం పడటం వల్ల, వేలు వంకరపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు. వేలు వంకరపోయిందంటూ అప్పట్లో చాలామంది తమ వేళ్లని ఫోటో తీసి మరీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. రోజుకి ఆరుగంటలకు మించి చిటికెన వేలు మీద భారం పడితే వేలు వంకరపోయే ప్రమాదం లేకపోలేదంటున్నారు వైద్యులు. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో కూర్చున్న ప్రయాణికుల్ని చూడండి అందరూ ఫోన్లను చూస్తూ నిమగ్నమై ఉంటారు. మరీ ముఖ్యంగా కుర్రకారు అయితే తీక్షణంగా తలలు వంచి ఫోన్లలో ఏదో టైప్ చేస్తూ కనిపిస్తారు. తల, భుజాన్ని గంటల తరబడి వంచడం వల్ల వస్తున్న సమస్యే టెక్స్ట్ నెక్. వెన్ను పైభాగం, భుజాలలో తీవ్రమైన నొప్పి రావడం దీని లక్షణం. దీన్ని కనుక అశ్రద్ధ చేస్తే చిన్న వయస్సులోనే కీళ్ల సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ను తలకి సమాంతరంగా ఉంచి వాడటం, మధ్యమధ్యలో చూపుని స్ర్కీన్ నుంచి తప్పించడం లాంటి చిట్కాలతో ఈ సమస్య రాకుండా జాగ్రత్త పడవచ్చని చెబుతున్నారు. త్వరగా టైప్ చేసుకోవడానికి వీలుగా ఉండే క్వెర్టీ కీపాడ్ ఈ ఫోన్కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది. బొటనవేలు ఉపయోగించి ఆ కీపాడ్తో తెగ మెసేజులు పంపేవారు. ఇలా అతిగా ఫోన్ కీపాడ్ వాడటం వల్ల వచ్చే వ్యాధికి ‘బ్లాక్బెరీ ఽథంబ్’ అని పేరు పెట్టారు. దీనికి ఆండ్రాయిడ్ థంబ్, స్మార్ట్ఫోన్ థంబ్ లాంటి ముద్దు పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు బ్లాక్ బెరీ ఫోన్లు తగ్గిపోయాయి. సమస్య కూడా అరుదుగా వస్తోందట.
ల్యాండ్ఫోన్ల కాలంలో ప్రతి సెకనుకీ లెక్క ఉండేది. ఇప్పుడంతా అన్లిమిటెడ్ ఆఫర్ల మయం. మోచేతిని ఎక్కువసేపు మడిచి ఉంచినప్పుడు అక్కడ ఉండే ‘అల్నర్‘ అనే నరం మీద ఒత్తిడి కలగడమే ఇందుకు కారణం. ఇది క్రమంగా సెల్ఫోన్ ఎల్బోకు దారితీస్తుంది. కొత్తగా ఫోన్ కొనేవాళ్లు, ఆ ఫోన్లో ఎన్ని ఫీచర్లు ఉన్నాయో చూసుకుంటారే కానీ ఫోన్ పట్టుకోవడానికి సౌకర్యంగా ఉందో లేదో గమనించరు. అసహజమైన రీతిలో వాటిని గంటల తరబడి పట్టుకుని ఉండటం వల్ల చేతి కండరాలు దెబ్బతినే అవకాశం ఉంది. వినికిడి లోపం, నిద్రలేమి లాంటి ఇతర అనారోగ్యాల గురించి చెప్పాలంటే పెద్ద జాబితానే అవుతుంది. అందుకే ఏదైనా మితంగా వాడితేనే మంచిది. ఈ కరోనా లాక్డౌన్లో మీ ఫోన్లు, గాడ్జెట్స్కు మరింత అతుక్కుపోకుండా స్వీయనియంత్రణ పాటించాలి.