సాధారణంగా ఎల్లప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వివాదాలలో చిక్కుకునే దర్శకుడు రాంగోపాల్ వర్మ.. సినిమాలను పక్కన పెడితే తన ఐడియాలజీ పరంగా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంటాడు. సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించే వర్మ.. ట్వీట్లతో జనాలను ఎంటర్టైన్ చేస్తుంటాడు. వర్మ చెప్పే విషయాలు సెటైరికల్ గా అనిపించినా సత్యాలే అని నమ్మేవారి సంఖ్య లక్షల్లో ఉందంటే.. ఎంతలా ప్రభావితం అవుతున్నారో చెప్పవచ్చు.
ఇటీవల వర్మ చేసిన ఫిలాసఫీ ట్వీట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ‘అసలు సమస్య ఏంటంటే.. ఇప్పుడున్న కాలంలో నిజాలు చెప్పేవారిని ద్వేషిస్తున్నారు. అబద్దాలు చెప్పేవారిని ప్రేమిస్తున్నారు’ అంటూ ఓ ట్వీట్ వేశాడు. అలాగే ‘మనుషులంతా అబద్దాలనే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే అవి నిజాలకంటే కంఫర్ట్ గా ఉంటాయి. నిజం బట్టలిప్పి నగ్నంగా నిలబెడుతుంది. కానీ అబద్దాలు వాటిని కవర్ చేస్తుంటాయి కదా? అంటూ తన స్టైల్ లో ఓ ఫిలాసఫీ పోస్ట్ చేశాడు.
తాజాగా వర్మ ఫిలాసఫీకి సోషల్ మీడియా ఫేమ్ దీప్తి సునయన ప్రభావితం అయినట్లుంది. అందుకే తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో వర్మ ట్వీట్ పోస్ట్ చేసింది. అయితే.. దీప్తి సునయన పోస్ట్ చూశాక చాలామందికి ఒకే డౌట్ వస్తుంది. దీప్తికి ఇటీవలే షణ్ముఖ్ తో బ్రేకప్ జరిగిన సంగతి తెలిసిందే. ఇదే అదనుగా వర్మ ట్వీట్ ని షన్ను పై సెటైరికల్ గా కౌంటర్ వేస్తూ పోస్ట్ చేసిందని అంటున్నారు నెటిజన్లు. మరి ఈ జంట కలిసే సూచనలు ఉన్నాయంటూ పుకార్లు వినిపిస్తున్నా.. ఇద్దరి మధ్య దూరం అలాగే ఉందంటూ టాక్ నడుస్తుంది. మరి దీప్తి పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.