500 రూపాయల విషయంలో మొదలైన వివాదం.. జుట్లు పట్టుకుని కొట్టుకునే దాకా వెళ్లింది. అది కూడా దారినపోయే వాళ్లో.. నీళ్ల ట్యాంక్ దగ్గర మహిళలో కాదు. ఒకరు ఆశా కార్యకర్త అయితే.. మరొకరు ANMగా విధులు నిర్వహిస్తున్న మహిళ. ఏకంగా చెప్పులతో దాడి చేసుకున్నారు. అక్కడున్న ఓ వ్యక్తి ఎంతో ప్రయాస పడి వారిద్దరినీ విడదీశాడు. వారి వీడియో వైరల్ కావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు.
వివరాల్లోకి వెళ్తే.. బిహార్ జముయి జిల్లాలోని ఓ ప్రాథమిక కేంద్రంలో ఈ ఘటన జరిగింది. జముయి జిల్లా లక్ష్మీపూర్ బ్లాక్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ నవజాత శిశువుకు టీకా వేయించేందుకు ఆశా కార్యకర్త రింటు కుమారి పీహెచ్సీకి తీసుకొచ్చింది. అక్కడున్న ANM రంజన కుమారి టీకా వేసేందుకు రూ.500 డిమాండ్ చేసిందని ఆశా కార్యకర్త ఆరోపించింది. అక్కడ వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాసేపటికే చినికి చినికి గాలివానలా మారింది. మాటల నుంచి వారిద్దరూ చేతల్లోకి దిగారు. జుట్లు పట్టుకుని కొట్టుకోవడం మొదలు పెట్టారు. అంతేకాదు చెప్పులతో బాహాబాహీకి దిగారు. అక్కడున్న ఓ వ్యక్తి అడ్డుకుని అతికష్టం మీది వారిద్దరినీ విడదీశాడు.
ఈ ఘటనపై ఆస్పత్రి ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇంకా వారిపై చర్యలు తీసుకోలేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆశా కార్యకర్త- ANM పరస్పరం దాడి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ये दृश्य @NitishKumar के स्वास्थ्य विभाग की असलियत की कहानी बयान कर रहा हैं जहां एक टीका के बदले 500 घूस की माँग पर एएनएम और आशा सेविका ऐसे उलझ गयी @ndtvindia @Anurag_Dwary @mangalpandeybjp @PratyayaIAS pic.twitter.com/98JrknbpMk
— manish (@manishndtv) January 24, 2022