తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆ ఉద్యోగుల వేతనాల పెంపుపై, ఉచిత స్మార్ట్ ఫోన్ పంపిణీపై కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బీసీ వర్గానికి చెందిన చేతి వృత్తుల వారికి, హస్త కళాకారులకి, రూ. లక్ష ఆర్థిక సహాయం అందించిన విషయం తెలిసిందే. ప్రతి నెలా అర్హులకు రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తామని ఆ మధ్య తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల మైనార్టీలకు కూడా రూ. లక్ష ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తోంది. తాజాగా మరో శుభవార్త చెప్పింది. వారి వేతనాలు పెంచడంతో పాటు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను అందజేస్తుంది. అంతేకాదు సెల్ ఫోన్ బిల్లులను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు.
ఆశావర్కర్లపై తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో సీఎం కేసీఆర్ 108, అమ్మఒడి వాహనాలను ప్రారంభించారు. దీంతో 466 అంబులెన్స్ లో అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో ఆశావర్కర్లు చాలా కష్టపడుతున్నారని.. వారి కష్టాన్ని ప్రభుత్వం గుర్తించిందని అన్నారు. అందుకే ఈ నెల నుంచి ఆశావర్కర్ల ఫోన్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు. దీంతో వారి భారం తగ్గుతుందని అన్నారు.
దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే ఆశావర్కర్ల జీతాలు ఎక్కువని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో స్కాములు ఉంటే.. తెలంగాణలో మాత్రం స్కీములు ఉంటాయని అన్నారు. ఇక కొత్తగా చేరిన ఆశా వర్కర్లకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. అలానే 108 ఉద్యోగులకు నాలుగు స్లాబులుగా వేతనాలు పెంచుతామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు కురిపించడంతో ఆశావర్కర్లు, 108 సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.