భారతీయ మహిళల వద్ద దాదాపు 21000 టన్నుల బంగారం ఉందని తెలుస్తుంది. అంటే బంగారాన్ని అంతా ఒక్కదగ్గర పోగుచేస్తే లారీల కొద్ది బంగారం నిల్వలు ఉన్నట్లు తెలుస్తుంది.
భారతీయ మహిళలకు బంగారమంటే చాలా ప్రీతి. ఎన్ని నగలు ఉన్నాకూడా మరొకటి కొంటూనే ఉంటారు. చూసిన ప్రతి ఆభరణం కొంటే బాగుండు అనిపిస్తుంది. బంగారు ఆభరణాలపై లేడీస్కు ఎప్పటికీ మోజు తీరదు. బంగారంపై ప్రపంచలో ఎక్కడాలేని డిమాండ్ మన భారత దేశంలోనే ఉందంటే అది అతిశయోక్తి కాదు. కొన్ని పర్వదినాల్లో తప్పనిసరిగా బంగారం కొని ఇంటికి తీసుకొస్తారు. ఏడాదిలో ముఖ్యంగా అక్షయ తృతీయ, దీపావళి ఫెస్టివల్, వరలక్ష్మీ వ్రతం ఇలాంటి పర్వదినాల్లో తప్పనిసరిగా బంగారం కొని పూజలో పెడతారు. శుభ కార్యాలలో గోల్డ్ ఐటమ్స్ గిఫ్ట్గా కూడా ఇస్తారు. వరల్డ్ లో ఇతర దేశాలతో పోలీస్తే మన దేశంలోనే ఎక్కువ మంది బంగారాన్ని వినియోగిస్తారు. కొందరు గోల్డ్పై ఇన్వెస్ట్ చేస్తారు. బంగారంపై పెట్టుబడి సాధనంగా చూసినా కూడా భారతీయ మహిళల దగ్గర ఎక్కువ బంగారం ఉందనే చెప్పాలి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం..
భారతీయ మహిళల వద్ద గోల్డ్ దాదాపు 21000 టన్నుల బంగారం ఉందని తెలిపింది. అంటే బంగారాన్ని అంతా ఒక్కదగ్గర చేర్చితే లారీల కొద్ది బంగారం పోగవుతుందన్నమాట. ఇంకా ఈ గోల్డ్ విలువ 1 ట్రిలియన్ డాలర్లు ఉంటుందని.. భారతీయ కరెన్సీతో పోలిస్తే దాదాపు రూ.100 లక్షల కోట్లుగా ఉంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. ప్రపంచం మొత్తం దేశాలకు అప్పులు ఇచ్చే ప్రపంచ బ్యాంక్ వద్ద ఉన్న బంగారం నిల్వల కంటే భారతీయ మహిళల వద్ద ఎక్కువ బంగారం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రపంచ గోల్డ్ రిజర్వ్ డేటా ప్రకారం..
అమెరికా సెంట్రల్ బ్యాంకు వద్ద 8133.47 టన్నుల బంగారం ఉండగా, జర్మనీ సెంట్రల్ బ్యాంకు వద్ద 3358.50 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. రష్యా కేంద్ర బ్యాంక్ వద్ద 2301.64 టన్నుల గోల్డ్, చైనా కేంద్ర బ్యాంక్ వద్ద 1948 టన్నుల బంగారం.. అదేవిధంగా మన భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద 760.40 టన్నుల బంగారం నిల్వ ఉంది. భారత్ లో ఎక్కువగా బంగారంపైనే పెట్టుబడిగా పెడతారు.షేర్లు, మ్యూచువల్ ఫండ్ల వంటి పెట్టుబడుల్లో 5శాతం మాత్రమే మళ్లిస్తుంటారు. దేశంలో బంగారంపై ఎక్కువ పెట్టుబడి తమిళనాడు రాష్ట్రంలో.. 28 శాతం వరకు పెడతారని తేలింది. బంగారానికి భారతీయ మహిళలకు విడదీయరాని అనుబంధం ఉంది.