అదృష్టం ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది. అది ఓ కొత్తజంటను వరించింది. ఓ నూతన దంపతులు కూడా ఏకంగా లాటరీలో కేజీ బంగారం గెలుచుకున్నారు. దీంతో ఆ కొత్తజంటకు పట్టలేని సంతోషంతో ఎగిరి గంతేశారు. వివరాలలు తెలుసుకుందాం.
సాధారణంగా మనం వింటుంటాం.. వారికి అదృష్టం వరించిందని అంటుంటారు. అంటే అనుకోకుండా కలిసి వస్తే ఒక్కరోజులో కోటీశ్వరుడు అయిపోయాడు అని.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడని..అంటుంటారు. లాటరీ తగలడం ద్వారా చాలా మంది కోటీశ్వరులు అయ్యారు. అదృష్టం ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది. అది ఓ కొత్తజంటను వరించింది. ఓ నూతన దంపతులు కూడా ఏకంగా లాటరీలో కేజీ బంగారం గెలుచుకున్నారు. అదృష్టం వారిని ఇలా వరించిందన్నమాట. ఒకనెల రోజుల క్రితం మ్యారేజ్ చేసుకున్ననూతన వధూవరులకు కానుకగా అదృష్టం వరించింది. ఓ షాపులో బంగారం కొన్నందుకుగాను లాటరీ తీశారు. లాటరీ తీయగానే ఆ దంపతులకు కేజీ బంగారం తగిలింది. దీంతో ఆ కొత్తజంటకు పట్టలేని సంతోషంతో ఎగిరి గంతేశారు. వివరాలలోకి వెళితే..
బళ్లారిలోని కప్పగల్ గ్రామానికి చెందిన నాగరాజు నివాసముంటున్నాడు. అతనికి కుమార్తె ఉంది. తన కుమార్తె రుచితను అల్లీపురానికి చెందిన నాగార్జునతో పెళ్లి జరిపించారు. పెళ్లికి నగలు కొనడం మామూలే కదా! అలాగే నాగరాజు కూడా తన కూతురి పెళ్లికోసమని బళ్లారిలో ఓ నగల షాపులో నగలు కొన్నాడు. కొనుగోలు చేసే సమయంలోనే నాగరాజుకు ఒక కూపన్ ఇచ్చారు. అంతకుముందే కర్ణాటక జ్యూవెలరీ ఫెడరేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 10 నుండి రాష్ట్రంలో బంగారం దుకాణాల్లో లాటరీ కూపన్లు పంపిణీ చేశారు. రూ.5వేలకు పైగా బంగారం కొన్నవారికి కూపన్లను ఇవ్వడం జరిగింది. దీంతో నాగరాజుకు కూడా నగల దుకాణంలో లాటరీ కూపన్ పంపిణీ జరిగింది. ఆ విధంగా రాష్ట్రంలో ఏకంగా 12 లక్షల పైగా కూపన్లు పంచబడ్డాయి. ఈ క్రమంలో లక్కీ డిప్ తీయగా నాగరాజు ఒక కేజీ బంగారం గెలుచుకున్నారని ప్రకటించారు.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం చూస్తే రూ. 55 లక్షల విలువ చేస్తుందంటున్నారు. ఆదివారం కొత్తజంట నాగార్జున, రుచితలు జ్యువెలరీ ఫెడరేషన్ ప్రముఖుల నుండి ఒక కేజీ బంగారం అందుకున్నారు. వారు బంగారం గెలుచుకున్నందుకు నాగరాజు కూతురు అదృష్టవంతురాలని సంతోషం వ్యక్తం చేశారు. స్థానికులు, జ్యువెలరీ ఫెడరేషన్ ప్రముఖులు నూతన దంపతులను అభినందించారు. అనుకోకుండా కలిసి వచ్చిన ఈ అదృష్టం సంఘటనపై మీ కామెంట్స్ తెలయజేయండి.