విజయవాడకు చెందిన ఇందు తన లక్ష్యంపై ఏకాగ్రతతో శ్రమించి విజయం సాధించింది. ఆమె తల్లి మాధవి, తండ్రి పేరు సత్యనారాయణ. సొంత ఊరు కృష్ణా జిల్లా పెనమలూరు. తండ్రి గెస్ట్ లెక్చరర్.. తల్లి సాధారణ గృహిణి. విజయవాడలో బీటెక్ కంప్లీట్ చేసి, అమెరికాలో ఎం.ఎస్ పబ్లిక్ పాలసీ పూర్తి చేసింది.
సాధారణంగా చదువుకుని మంచి జాబ్ చేయాలంటే స్వయం కృషి చాలా అవసరం. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే నిర్విరామ కృషి చేయాల్సి ఉంటుంది. అప్పుడు లక్ష్యం చేరుకుంటాం. సాధించే లక్ష్యంపై ఏకాగ్రత, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో పోరాడిన వారికి విజయం సొంతమవుతుంది. అలాగే విజయవాడకు చెందిన ఇందు కూడా చాలా కష్టపడి చదివే మనస్తత్వం కలిగిన యువతి. ఆమె తల్లి మాధవి, తండ్రి పేరు సత్యనారాయణ. సొంత ఊరు కృష్ణా జిల్లా పెనమలూరు. వీరిది మధ్యతరగతి కుటుంబం. తండ్రి గెస్ట్ లెక్చరర్.. తల్లి సాధారణ గృహిణి. విజయవాడలో బీటెక్ కంప్లీట్ చేసి, అమెరికాలో ఎం.ఎస్ పబ్లిక్ పాలసీ పూర్తి చేసింది. తన లక్ష్యంపై ఏకాగ్రతతో శ్రమించి విజయం సాధించింది. ప్రస్తుతం ఏకంగా ప్రపంచ బ్యాంక్లోనే ఉద్యోగం సాధించింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘అమెరికాలో ఎం.ఎస్. చదివి అక్కడే ఉద్యోగం చేయాలని ఉండేది. కోవిడ్ సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో అమెరికా వెళ్లాను. అక్కడికి వెళ్లిన తర్వాత నా దృష్టి విస్తరించింది. ప్రపంచ స్థాయిలో మానవజాతిని ప్రభావితం చేయగల ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ సంస్థల్లో పని చేయాలని నిర్ణయించుకున్నా’ అని తెలిపింది. ‘‘యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మేసన్’ లో ఎంఎస్, పబ్లిక్ పాలసా కోర్సులో చేరాను. యూనివర్సిటీ స్థాయిలో అనేక అంశాలపై అధ్యయనం చేసి అమెరికాలోనే ప్రఖ్యాతి గాంచిన ప్రొఫెసర్ టిమ్ స్మీడింగ్ వద్ద స్కిల్స్ పెంపొందించుకుని.. యూనివర్సిటీ స్థాయిలో ఇచ్చిన ప్రజెంటేషన్స్, పరిశోధనల ఆధారంగా ప్రపంచ బ్యాంక్ జాబ్ ఇచ్చింది’ అని ఆమె వెల్లడించింది.
ఉద్యోగ నిర్వహణలో దక్షిణ ఆసియా దేశాలకు సంబంధించిన వాతావరణ విభాగం విధులను అప్పగించారు. వాతావరణ మర్పును అధ్యయనం చేసే ఎక్స్పర్ట్గా పనిచేస్తుంది. జాయింట్ మల్టీ బ్యాంక్ డెవలప్మెంట్, టెక్నాలజీ అమలు చేయడం, ఇతర దేశాలలో వాతావరణ కాలుష్య ప్రామాణికతల నిర్ణయించడం వంటి బాధ్యతలు ఇందుకు కేటాయించారు. వీటిపై రిపోర్టులు తయారు చేసి, ఎంవోయూలు చేసుకోవడం, సమావేశాల్లో చర్చించడం మొదలైనవి ఆమె విధులు. అమెరికా ప్రభుత్వం ఆమెకు ప్రత్యేకంగా జీ4 వీసా ఇచ్చింది. ఇప్పటికే జాబ్ లో జాయిన్ కావలాలని ప్రపంచ బ్యాంక్ నుండి ఆదేశాలు వచ్చాయి. అతి త్వరలోనే ఆమె అమెరికాకి వెళ్లి ఉద్యోగంలో చేరనుంది.
గతంలో కూడా ఇందు చాలా అవార్డులను కైవసం చేసుకున్నారు. ఎంఎస్ లో అత్యుత్తమ గ్రేడ్స్ సాధించి మూడు సెమిస్టర్లలో రూ. 65 లక్షల స్కాలర్షిప్ అందుకున్నారు. ఇవే కాకుండా ఇందు ఔట్స్టాండింగ్ స్టూడెంట్ అవార్డు, బెస్ట్ స్టూడెంట్ ఎంప్లాయ్ గా గోల్డెన్ బ్రిక్ అవార్డు, బెస్ట్ పైరో ప్రైజ్ విన్నర్, బెస్ట్ పేపర్ ఇన్ సైన్స్ అండ్ పబ్లిక్ పాలసీ పురస్కరాలు అందుకున్నారు. దక్షిణ ఆసియా దేశాలలో గ్లోబల్ వార్మింగ్ తగ్గింపుపై ప్రాజెక్ట్ రూపొందించి, భారత్-పాకిస్తాన్ దేశాలలో వెదర్ అధ్యయనం చేయనున్నట్లు తెలిపింది. ఫైనల్గా తను అనుకున్నది సాధించి త్వరలోనే ప్రపంచ బ్యాంక్లో ఉద్యోగంలో చేరనున్న ఇందుకు ఆల్ ది బెస్ట్. ఉద్యోగంలో కూడా మంచి విజయాలను సాధించాలని కోరుకుందాం. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.