రూ. 2 వేల నోటుని చూసి ఇదే పెద్ద కరెన్సీ నోటు అని అనుకుంటున్నాం. కానీ దీని కంటే పెద్ద నోటును ముద్రించారని మీకు తెలుసా? భారతదేశంలో అరుదైన రూ. లక్ష నోటును ముద్రించారు. ఎప్పుడో తెలుసా?
నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ప్రభుత్వ హయాంలో లక్ష రూపాయల నోటును ముద్రించడం జరిగింది. ఆజాద్ హింద్ బ్యాంక్ ఈ అరుదైన కరెన్సీ నోటును ముద్రించింది. అయితే ఈ నోటుపై మహాత్మా గాంధీ బొమ్మ ఉండదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముఖ చిత్రం ఉంటుంది. ఎందుకంటే ఆజాద్ హింద్ బ్యాంక్ ని స్థాపించింది చంద్రబోస్ కాబట్టి. ఈ బ్యాంక్ బర్మాలోని రంగూన్ లో ఉంది. ఈ బ్యాంకుని బ్యాంక్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా పిలుస్తారు. బ్రిటిష్ వారితో పోరాడే సైనికులకు విరాళాలు సేకరించడం కోసం ఈ బ్యాంకుని స్థాపించారు. ఆ సమయంలోనే లక్ష రూపాయల నోటును ముద్రించారు. బ్రిటిష్ బానిస సంకెళ్ళను తెంచుకుని భారతదేశం స్వతంత్ర దేశంగా మారుతుందని తెలియజేయడం కోసం ఈ లక్ష రూపాయల నోటును ముద్రించారు.
భారతదేశం యొక్క సార్వభౌమాధికారానికి ప్రతీకగా ఈ నోటును ముద్రించారు. ఈ నోటును ముద్రించడం ద్వారా భారతదేశం యొక్క చట్టబద్ధమైన ఇమేజ్ తో కూడిన ఆర్థిక చట్రాన్ని పరిచయం చేసినట్టు అయ్యింది. ఆర్థిక స్వావలంబనను సాధించడం కోసం ఈ భారీ కరెన్సీ నోటును ముద్రించారు. దీంతో బ్రిటిష్ వారు విధించిన ఆర్థిక సంకెళ్ళ నుంచి విముక్తి పొందే దిశగా అడుగు పడింది. తమ నియంత్రణలో ఉన్న భూభాగాల్లో వాణిజ్యాన్ని, ఆర్థిక కార్యకలాపాలను ప్రమోట్ చేయడానికి, ఆర్థిక స్థిరత్వాన్ని అందించడానికి మనకంటూ సొంత ఆర్థిక విధానాన్ని స్థాపించుకోవాలని అప్పట్లో ఆజాద్ హింద్ ప్రభుత్వం కోరింది. ఈ లక్ష రూపాయల నోటు అప్పట్లో భారతీయుల్లో జాతీయ సమైక్యతను, దేశభక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది.
లక్ష రూపాయల నోటును ముద్రించడం ద్వారా మానసికంగా ఇటు భారతీయుల మీద, అటు బ్రిటిష్ వారి మీద ప్రభావం చూపించింది. ఇది భారతీయుల్లో ఆశని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. బ్రిటిష్ పాలనకు ప్రత్యామ్నాయంగా భారత ప్రభుత్వం ఏర్పడడం సాధ్యమే అన్న నమ్మకం ఏర్పడింది. ఈ లక్ష రూపాయల నోటును విడుదల చేసిన ఆజాద్ హింద్ బ్యాంకుకు ప్రపంచంలోని 10 దేశాల మద్దతు లభించగా.. బర్మా, జర్మనీ, చైనా, ఇటలీ, థాయ్ లాండ్, ఐర్లాండ్ దేశ బ్యాంకులు ఆజాద్ హింద్ ప్రభుత్వం ముద్రించిన కరెన్సీని గుర్తించాయి. ఏది ఏమైనా గానీ సుభాష్ చంద్రబోస్ అప్పట్లో లక్ష రూపాయల నోటుని ప్రవేశపెట్టడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉందని నిరూపించారు.
Note of 1 lakh rupees came during the #AzadHind government of #Netaji #SubhashChandraBose. You will be surprised to know that there was no picture of #MahatmaGandhi on this note, but the picture of Subhash Chandra Bose was printed. Issued by #AzadHindBank. pic.twitter.com/IlN72BFyl7
— Satyaagrah (@satyaagrahindia) May 20, 2023
100000 (One Lakh ) Rupee Note Issued by Bank of Independence of Netaji Subhas Chandra Bose pic.twitter.com/I82CsYT228
— indianhistorypics (@IndiaHistorypic) November 11, 2016