తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. మహబూబ్ నగర్ లో ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించారు. ఫ్రీడమ్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి పోలీసుల వద్దనుండే ఎస్ఎల్ఆర్ వెపన్ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు. అందుకు సంబంధించిన వీడియోలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మంత్రి చేసిన పనిపై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి చేసిన చర్యపై ప్రస్తుతం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉంటూ అలా ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తం సందర్భాల్లో మంత్రి కాల్పులు జరిపినట్లు వీడియోలు వచ్చాయి. అయితే కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు అలా కాల్పులు జరిపి ఉండచ్చని భావిస్తున్నారు. కొందరేమే మంత్రి సరదాకి పోలీసుల వద్దను తుపాకి తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారంటున్నారు.
ఏది ఏమైనా అలా పబ్లిక్ ర్యాలీలో మంత్రి గాల్లోకి కాల్పులు జరపడం ఇప్పుడు తీవ్ర చర్చకు, విమర్శలకు దారి తీసింది. అయితే ఈ అంశంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. తనకు ఎస్పీనే స్వయంగా గన్ ఇచ్చారంటూ తెలిపారు. అంతేకాకుండా తాను కాల్చింది రబ్బర్ బుల్లెట్ అని చెప్పారు. తాను రైఫిల్ అసోసియేషన్ మెంబర్ అని మంత్రి తెలిపారు. అంతేకాకుండా స్పోర్ట్స్ మీట్ అలాంటివి సహజమే అన్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
It can only happen in #Telangana! #TRS Minister Srinivas Goud use a police weapon to fire shots during a crowded event ( top police sources say it’s ILLEGAL). Twice this week, he used SLR (a prohibited bore weapon) to fire shots. I Hope @TelanganaDGP initiates action. pic.twitter.com/EBVJaSBz14
— Ashish (@KP_Aashish) August 13, 2022