పార్టీ వల్ల, నేతల వల్ల లబ్ధి పొందిన కార్యకర్తలు చాలా అరుదు. కానీ పార్టీ కోసం, అభిమాన నాయకుల కోసం ఆస్తులు అమ్ముకుని మరీ ప్రచారం చేసి.. ఆఖరకు రోడ్డున పడ్డ కార్యకర్తలు ఎందరో ఉన్నారు. పార్టీ కోసం సర్వం కోల్పోయిన మహిళా కార్యకర్త దీన స్థితి చూసి చలించిపోయాడు మినిస్టర్. ఆయన ఏం నిర్ణయం తీసుకున్నారు అంటే..
ఆర్ఆర్ఆర్.. ఆస్కార్ వేడుకలో హిస్టరీ క్రియేట్ చేసింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్.. నాటు నాటు సాంగ్ తో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అందుకుంది. 95వ ఆస్కార్ వేడుకలలో సంచలనం సృష్టిస్తూ.. ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమా సత్తాని, ఇండియన్ సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ఈ క్రమంలో ఆస్కార్ గెలిచినందుకు ఆర్ఆర్ఆర్ సినిమాని కొనియాడుతూనే.. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొత్త చర్చలకు తెరలేపారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ని మరింత సుందర నగరంగా తీర్చిదిద్దుతుంది ప్రభుత్వం. హైదరాబాద్ నగరం వచ్చే 30 ఏళ్లలో మరిన్ని కిలోమీటర్ల మేర విస్తరిస్తుందని మంత్రి కేటీఆర్ ఓ సందర్భంలో అన్నారు. దీనికి అనుగుణంగా అన్ని వసతులతో పాటు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇక ప్రపంచంలో క్రికెట్ ని అభిమానించేవారు మరింతగా పెరిగిపోతున్నారు. హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియం తరహాలో అన్ని వసతులు.. అధునాతన సౌకర్యాలతో అంతర్జాతీయ స్థాయిలో […]
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. మహబూబ్ నగర్ లో ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించారు. ఫ్రీడమ్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి పోలీసుల వద్దనుండే ఎస్ఎల్ఆర్ వెపన్ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు. అందుకు సంబంధించిన వీడియోలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మంత్రి చేసిన పనిపై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి చేసిన చర్యపై ప్రస్తుతం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉంటూ అలా […]
ఎన్నికల ముందు ప్రజల వద్దకు వచ్చి మీ కష్టాలు తీరుస్తా.. నన్ను గెలిపించడండి అంటూ నేతలు ఎన్నో వాగ్దానాలు చేస్తుంటారు. ఇక గెలిచిన తర్వాత అటు ముఖం కూడా చూపించని నేతలను ఎంతో మందిని చూస్తుంటాం. కానీ.. కొంత మంది రాజకీయ నేతలు మాత్రం కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ తమ వాగ్దానాలు నిలబెట్టుకుంటారు. ఓ చిన్నారి తెలంగాణ మంత్రి వద్దకు వచ్చి దీనంగా నన్ను చదవించండి సార్ అని అడగడంతో ఆయన చలించిపోయారు. చదువుపై ఉన్న శ్రద్ద […]
ఈ మద్య రాజకీయ నేతలు పలు సందర్భాల్లో తమ మానవత్వాన్ని చాటుకుంటున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. రోడ్డుపై ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు తమ కాన్వాయ్ ఆపి మరి ప్రమాదంలో ఉన్నవారిని రక్షించిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి ఓ వ్యక్తికి యాక్సిడెంట్ జరగడాన్ని చూసి వెంటనే చలించిపోయారు. ఏనుగొండ వద్ద జేజేఆర్ […]
తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏకంగా టీఆర్ఎస్ మినిస్టర్ హత్యకు స్కెచ్ వేయడం సంచలనంగా మారింది. పోలీసులు కుట్రను భగ్నం చేసి.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాలు.. తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు కుట్ర జరిగిందని.. దీనికి సంబంధించి 8 మందిని అరెస్ట్ చేశామని.. సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వివరాలను.. సైబరాబద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర బుధవారం రాత్రి మీడియా సమావేశంలో వెల్లడించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు […]
ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.. మీ ఇంటికి వచ్చి కరోనాకి చికిత్స అందిస్తామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుగొండలో “ఇంటింటి ఆరోగ్యం” కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కరోనాను ఎదుర్కోవడంలో భాగంగానే “ ఇంటింటా ఆరోగ్యం” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజలు కరోనా పట్ల భయపడాల్సిన అవసరం లేదన్నారు. డాక్టర్లు సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. […]
రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి మాతృమూర్తి శాంతమ్మ కన్నుమూశారు. హైదరాబాద్లో శుక్రవారం రాత్రి గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. శాంతమ్మ అంత్యక్రియలు మహబూబ్ నగర్ పట్టణంలోని వారి వ్యవసాయ క్షేత్రంలో శనివారం సాయంత్రం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ ఈ ఏడాది ఫిబ్రవరి 14న మరణించారు. ఇక తన తల్లి మృతదేహం వద్ద శీనివాస్ గౌడ్ రోధిస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్ ఉప ఎన్నికల పుణ్యమా అంటూ కొత్త పథకానికి శ్రీకారం చుట్టాడు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల కుటుంబాలలో ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల నగదుతో దళిత బంధు అనే పథకాన్ని రూపొందించారు. అయితే ఈ పథకాన్ని ముందుగా హుజురాబాద్లో అమలు చేస్తామని సీఎం చెప్పారు. ఇక ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కిపెట్టడంతో వారిని దెబ్బకొట్టేందుకు ఆ పథకాన్ని తన దత్తత గ్రామమైన వాసాలమర్రికి షిఫ్ట్ చేశారు. ఇక దళిత బంధు పథకం […]