గత కొంత కాలంగా టి కాంగ్రెస్ లో సొంత పార్టీ నేతల మద్య మాటల యుద్దం నడుస్తుంది. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనాలు సృష్టించాయి. చండూరుసభలో తనను అవమానకరంగా తిట్టించిన రేవంత్ రెడ్డి తనకు క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. తనకు క్షమాపణ చెప్పిన తర్వాతే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంపై స్పందించారు రేవంత్ రెడ్డి. కోమటిరెడ్డి వెంకట్ కి రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పారు. చండూరు బహిరంగ సభలో అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు సరైనవి కావని.. బాధ్యతగల సీనియర్ నాయకుడిపై అలాంటి వ్యాఖ్యలు చేసిందుకు తాను బాధ్యత వహిస్తూ క్షమాపణ కోరుతున్నట్లు.. అలాగే హోంగార్డ్ ప్రస్తావనపైనా రేవంత్ రెడ్డి క్షమామణ చెప్పారు. ప్రస్తుతం పరిస్థితుల్లో పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని వెల్లడించారు. ఇదిలా ఉంటే.. మునుగోడులో చేపట్టనున్న కాంగ్రెస్ పాదయాత్రలో పాల్గొనాల్సిందిగా తనను ఎవరూ ఆహ్వానించలేదని వెంకట్ రెడ్డి అన్నారు. పిలవని పేరంటానికి వెళ్లే అలవాటు తనకు లేదన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత చండూరులో నిర్వహించిన పార్టీ సమావేశానికి తనకు ఆహ్వానం కూడా తనకు అందలేదని.. అంతేకాదు సభలో సొంత పార్టీ నేతలతోనే తనను తిట్టించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవిషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. My apologies to brother and colleague @KomatireddyKVR garu. @manickamtagore @UttamINC pic.twitter.com/v7gkvXtlRD — Revanth Reddy (@revanth_anumula) August 13, 2022 ఇది చదవండి: లక్షన్నరకే ఓయూ ఇంజనీరింగ్ సర్టిఫికేట్.. వెలుగులోకి ఖంగుతినే నిజాలు! ఇది చదవండి: జ్ఞాపక శక్తి కోల్పోయిన భర్త! రూ.2 కోట్ల విలువైన ఆస్తిని…