ఆదివారం వస్తుందీ కదా హైదరాబాద్ లో చక్కర్లు కొట్టేద్దామనుకుంటే.. ఆగండీ. ఇది చదివి బయలుదేరండి. ఎందుకంటే నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు ప్రకటన చేశారు.
హైదరాబాద్ లో వర్కింగ్ డేసే కాదూ వీకెండ్ కూడా రోడ్లన్నీ ఫుల్ రద్దీగా ఉంటాయి. హోటల్స్, షాపింగ్స్ ఉంటే ప్రాంతాలైతే మరింత రద్దీ కామన్. ఇక వీకెండ్ వచ్చిందీ కదా అని హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టేద్దామనుకుంటున్నారా. అయితే ఈ అలర్ట్ మీ కోసమే. గచ్చిబౌలి, తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు, భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉండనున్నాయి. ఈ మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్ ఓ ప్రకటన చేశారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఎందుకు అనుకుంటున్నారా..?
ప్రముఖ సంగీత దర్శకులు ఇళయ రాజా లైవ్ కన్సర్ట్ ఈ ఆదివారం గబ్బిబౌలి స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇళయ రాజా కన్సర్ట్ కాబట్టి అభిమాన జనసందోహం హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. సుమారు 20 వేల మంది హాజరు కానున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని సీపీ తెలిపారు. పలు రూట్లను మళ్లించినట్లు వెల్లడించారు. లింగం పల్లి నుండి గబ్బిబౌలి జంక్షన్కు వచ్చే వాహనాలను హెచ్సీయూ బస్ డిపో వద్ద ఎస్ఎంఆర్ వినయ్ సిటీ, మసీద్ బండ, బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలి వైపుగా మళ్లించారు.
గచ్చిబౌలి సర్కిల్ నుండి లింగం పల్లి వెళ్లే వాహనాలు బొటానికల్ గార్డెన్, మసీద్ బండ, హెచ్సీయూ బస్ డిపో మీదుగా వెళ్లాల్సి వస్తుందని సీపీ తెలిపారు. రాయదుర్గం నుండి లింగం పల్లి వైపు వెళ్లే వాహనాలను ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుండి గోపిచంద్ అకాడమీ, విప్రో సర్కిల్, క్యూసిటీ, గోపన్ పల్లి, నల్లగొండ ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లాలన్నారు. లింగం పల్లి నుండి గచ్చిబౌలి జంక్షన్, గచ్చిబౌలి నుండి లింగం పల్లి వైపు భారీ వాహన రాకపోకలపై నిషేధం విధించినట్లు తెలిపారు. లారీలు, ట్రక్కులు, డీసీఎం, ఆర్ఎంసీలపై ఆంక్షలు ఉంటాయన్నారు. వాహనదారులు ఈ రూట్లను గమనించి.. ప్రత్యామ్నాయ మర్గాల్లో ప్రయాణించి నగర ట్రాఫిక్ పోలీసులకు సహకరించగలరని కోరారు.