Telangana Assembly Budget Session 2022 : తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు 2022-23 వార్షిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను శాసన సభలో ప్రవేశపెట్టారు. రూ. 2,56,958.51 కోట్లతో ఈ బడ్జెట్ తయారైంది. ఇందులో రెవెన్యూ వ్యయం 1.89 లక్షల కోట్ల రూపాయలు కాగా, క్యాపిటల్ వ్యయం 29,728 కోట్ల రూపాయలుగా ఉంది. వ్యవసాయ రంగానికి రూ. 24,254 కోట్లు, ఆసరా పెన్షన్లకు రూ. 11,728 కోట్లు, కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్కు రూ. 2,750 కోట్లు, డబుల్ బెడ్రూమ్ల కోసం రూ. 12,000 కోట్లు, దళితబంధు రూ. 17వేల 7వందల కోట్లు,
మన ఊరు- మన బడి రూ. 7,289 కోట్లు, ఎస్టీల సంక్షేమం కోసం రూ. 12,565 కోట్లు, పట్టణ ప్రగతి కోసం రూ. 1,394 కోట్లు, బీసీ సంక్షేమం కోసం రూ. 5,698కోట్లు, బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ. 177 కోట్లు, పల్లె ప్రగతి రూ. 3,330 కోట్లు, ఫారెస్ట్ యూనివర్సిటీకి రూ. 100 కోట్లు, హరితహారంకు రూ. 932 కోట్లు, రోడ్లు, భవనాల కోసం రూ. 1,542 కోట్లు కేటాయించబడింది. ఈ సందర్బంగా హరీశ్రావు మాట్లాడుతూ.. తెలంగాణలో కరెంట్ కోతలు, ఆకలి చావులు ఇప్పుడు లేవన్నారు. రాష్ట్ర పునఃనిర్మాణ బాధ్యతను సీఎం కేసీఆర్ తన భుజాలపై వేసుకున్నారన్నారు.
ముగ్గురు బీజేపీ సభ్యుల సస్పెండ్..
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజే ముగ్గురు బీజేపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బడ్జెట్ ప్రసంగానికి అడ్డుపడుతున్న ఈటల రాజేందర్, రాజా సింగ్, రఘునందన్ రావులను సస్పెండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ఈ ముగ్గురిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.