ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ప్రజలకు ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇస్తుంటారు. అవి సాధ్యమవుతాయా లేదా అన్న విషయం పట్టించుకోరు. ఆ తరువాత ఎన్నికల్లో విజయం సాధించాక ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చటంలో ఆలస్యం చేస్తారు. దీంతో ప్రతిపక్షంనుచి ఇటు ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతది.
ప్రజాప్రతినిధులు ప్రజల అవసరాలను తీర్చే క్రమంలో ఏమాత్రం ఆలస్యమైనా ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుంది. ఇదే విషయానికి సంబంధించి ఓ రాష్ట్ర ఎంఎల్ఎ ఇంటిపై ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఏకంగా ఐఈడి బాంబులతో దాడి చేసేందుకు పూనుకున్నారు. అసలు ఆ ఎంఎల్ఎ నివాసంపై దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది. ఆ దుండగులు ఎందుకు కక్ష్యగట్టారు. అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
కెబి దేవి మణిపూర్ లోని నౌరియాపఖాంగ్ లక్పా అసెంబ్లీ నియోజక వర్గ ఎంఎల్ఎ. ఆమె బిజెపికి చెందిన నాయకురాలు. ఈ మధ్యకాలంలో మణిపూర్ లో చోటుచేసుకున్న హింసాత్మకఘటనలు ఆ రాష్ట్రంలో తీవ్రవైన అలజడులు సృష్టించాయి. అక్కడ ఉన్నటువంటి కుకీ, నాగా, మైతీ తెలగల మధ్య చోటుచేసుకున్న రిజర్వేషన్ల వివాదం హింసాత్మకంగా మారింది. ఈ క్రమంలో బిజెపి ఎంఎల్ఎ కెబి దేవి ఇంటిపై గుర్తుతెలియని దుండగులు ఐఈడి బాంబులతో దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఆమె ఇంటి గేటు ధ్వంసం అయ్యింది. ఓ పక్క హింసాత్మకమైన ఘటనలు చోటుచేసుకుంటున్న మణిపూర్ లో బిజెపికి చెందిన మహిళా ఎంఎల్ఎను టార్గెట్ చేసి దాడి జరపడం అక్కడ సంచలనంగా మరింది.
బిజెపికి చెందిన మహిళా ఎంఎల్ఎ కెబి దేవి ఇంట్లో ఉన్న సమయంలో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఐఈడి బాంబులతో ఆమె నివాసం పై దాడికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. అయితే ఆ దృష్యాలు అక్కడ ఉన్నటువంటి సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. దాడి సమయంలో మహిళా ఎంఎల్ఎ ఇంట్లోనే ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సిసిటివి ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. అసలు ఆ నిందితులు ఎంఎల్ఎ ఇంటిపై దాడికి ఎందుకు పాల్పడ్డారు. వారు ఎవరు వారి వ్యూహం ఏంటనే విషయాలపై విచారణ జరిపి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.