దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ హరద్వార్ దూబే కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన..
దేశ రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ హరద్వార్ దూబే కన్నుమూశారు. దూబే గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కుటుంబసభ్యులు ఆయన్ని ఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. దూబే ఆరోగ్యంపై ఆయన కుమారుడు ఆదివారం ఓ ప్రకటన చేశారు. తన తండ్రి ఆరోగ్యంగానే ఉన్నాడని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, ఈ సోమవారం దూబే ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. సోమవారం తెల్లవారుజామున ఆయన గుండెపోటుకు గురయ్యారు.
డాక్టర్లు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. దీంతో ఆయన తుదిశ్వాస విడిచారు. దూబే పార్థివదేహాన్ని కుటుంబసభ్యులు సోమవారం మధ్యాహ్నం ఆగ్రాకు తీసుకెళ్లనున్నారు. అక్కడే అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక, దూబే మృతిపై బీజేపీ శ్రేణులు తమ సంతాపం తెలియజేస్తున్నారు. కాగా, హరద్వార్ దూబే ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎన్నికయ్యారు. గతంలో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా కూడా పని చేశారు.
Saddened by the passing away of Rajya Sabha MP Shri Hardwar Dubey Ji.
My heartfelt condolences to his family and friends. Praying for his sadgati.
Om Shanti pic.twitter.com/kaBYVt6ibC
— Pralhad Joshi (@JoshiPralhad) June 26, 2023